బీజేపీని ఓడించి అధికారంలోకి రావడానికి కాంగ్రెస్‌ను ఎవరు ఆపారో చెప్పాలి: ఒవైసీ

Asaduddin Owaisi Fire On Congress. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ కూడా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Nov 2022 2:30 PM GMT
బీజేపీని ఓడించి అధికారంలోకి రావడానికి కాంగ్రెస్‌ను ఎవరు ఆపారో చెప్పాలి: ఒవైసీ

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ కూడా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే..! అయితే ఎంఐఎం పోటీ చేయడం వలన భారతీయ జనతా పార్టీకి లాభిస్తుందని.. కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీకి అనుకూలంగా ఎంఐఎం వ్యవహరిస్తోందని కాంగ్రెస్ చెబుతోంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. గుజరాత్‌లో బీజేపీ సుధీర్ఘకాలం అధికారంలో ఉండటానికి కాంగ్రెస్ పార్టీ చేతగానితనమే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ లోపాలను కప్పిపుచ్చుకునేందుకు తమపై విమర్శలు చేస్తోందని గుజరాత్‌లో గత 27 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉండగా కాంగ్రెస్ మాత్రమే ప్రతిపక్షంలో ఉందని అన్నారు. ఇన్నాళ్లు బీజేపీని ఓడించి అధికారంలోకి రావడానికి కాంగ్రెస్‌ను ఎవరు ఆపారని ప్రశ్నించారు. ఎంఐఎం ఎవరి ఓట్లు చీల్చడానికి ఇష్టపడటం లేదని కేవలం బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకే మేం ఇక్కడికి వచ్చామన్నారు. గుజరాత్ అసెంబ్లీలో 182 స్థానాలు ఉన్నాయని తమ పార్టీ కేవలం 13 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్నామని అన్నారు. మిగతా 169 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మాకెలాంటి అభ్యంతరం లేదన్నారు.



Next Story