15 నిమిషాల పాటూ లైట్స్ ఆఫ్ చేయండి : అసదుద్దీన్

వక్ఫ్ సవరణ బిల్లుకు నిరసనగా ఏప్రిల్ 30, బుధవారం నాడు దేశవ్యాప్తంగా 15 నిమిషాల పాటు లైట్లు ఆర్పివేయాలని ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు

By Medi Samrat
Published on : 29 April 2025 8:33 PM IST

15 నిమిషాల పాటూ లైట్స్ ఆఫ్ చేయండి : అసదుద్దీన్

వక్ఫ్ సవరణ బిల్లుకు నిరసనగా ఏప్రిల్ 30, బుధవారం నాడు దేశవ్యాప్తంగా 15 నిమిషాల పాటు లైట్లు ఆర్పివేయాలని ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగే నిరసనలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) కు మద్దతు ఇవ్వాలని హైదరాబాద్ ఎంపీ ఒవైసీ భారత పౌరులను అభ్యర్థించారు.

"వివాదాస్పద వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు మీరందరూ రాత్రి 9:00 గంటల నుండి 9:15 గంటల వరకు 15 నిమిషాల పాటు మీ దుకాణాలు, ఇళ్లలోని లైట్లు ఆపివేయాలని నేను అభ్యర్థిస్తున్నాను" అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందితే, ముస్లింలు మసీదులు, దర్గాలు, ధార్మిక సంస్థలు, విలువైన భూములతో సహా వక్ఫ్ ఆస్తులపై నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని AIMPLB హెచ్చరించింది.


Next Story