Video: జగన్నాథ రథయాత్రలో గందరగోళం..భక్తులపైకి దూసుకెళ్లిన ఏనుగులు

జగన్నాథ్ రథయాత్రలో ఏనుగులు బీభత్సం సృష్టించిన ఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది.

By Knakam Karthik
Published on : 27 Jun 2025 11:33 AM IST

National News, Gujarat, Jagannath Rath Yatra, Elephant Attack, Stampede

Video: జగన్నాథ రథయాత్రలో గందరగోళం..భక్తులపైకి దూసుకెళ్లిన ఏనుగులు

జగన్నాథ్ రథయాత్రలో ఏనుగులు బీభత్సం సృష్టించిన ఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్తే.. అహ్మదాబాద్‌లో ఊరేగింపు కోసం తీసుకొచ్చిన ఏనుగులు భారీ సంఖ్యలో భక్తులను చూసి భయాందోళనకు గురై పరుగులు తీశాయి.

దీంతో స్వల్ప తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో మొత్తం 9 మంది భక్తులకు గాయాలయ్యాయి. మావటివాళ్లు ఏనుగులను అదుపులోకి చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అనంతరం పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు.

Next Story