జగన్నాథ్ రథయాత్రలో ఏనుగులు బీభత్సం సృష్టించిన ఘటన గుజరాత్లో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్తే.. అహ్మదాబాద్లో ఊరేగింపు కోసం తీసుకొచ్చిన ఏనుగులు భారీ సంఖ్యలో భక్తులను చూసి భయాందోళనకు గురై పరుగులు తీశాయి.
దీంతో స్వల్ప తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో మొత్తం 9 మంది భక్తులకు గాయాలయ్యాయి. మావటివాళ్లు ఏనుగులను అదుపులోకి చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అనంతరం పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు.