చైనా నుంచి కాంగ్రెస్‌ సంస్థకు డబ్బులు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Amit Shah attacks Congress after chaos in Parliament. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కాంగ్రెస్‌ పార్టీపై నిప్పులు చెరిగారు.

By Medi Samrat  Published on  13 Dec 2022 3:08 PM GMT
చైనా నుంచి కాంగ్రెస్‌ సంస్థకు డబ్బులు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కాంగ్రెస్‌ పార్టీపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ పార్టీ ఉద్దేశపూర్వకంగానే లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డుకుందని మండిపడ్డారు. చైనాపై సరిహద్దు వివాదంపై అమిత్‌షా మాట్లాడుతూ.. చైనా రాయబార కార్యాలయం నుంచి కాంగ్రెస్‌ నేతల సంస్థకు డబ్బులు చేరాయని ఆరోపించారు. రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌ కోసం ఆ డబ్బులు అందాయన్న అమిత్‌ షా.. మోదీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం ఏ ఒక్కరూ భారత్‌లో అంగుళం భూమిని కూడా ఆక్రమించలేరని స్పష్టం చేశారు. భారత్-చైనా బలగాల ఘర్షణపై రక్షణ మంత్రి ప్రకటన చేస్తారని చెప్పినప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డుకుందని మండిప‌డ్డారు.

రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్ కు సంబంధించి ఎఫ్‌సీఆర్‌ఏ రద్దు గురించి వేసిన ప్రశ్న ప్రస్తావనకు రాకుండా ఉండేందుకే సరిహద్దు అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తిందని అమిత్ షా నిప్పులు చెరిగారు. 2005-06, 2006-07 మధ్య కాలంలో చైనా రాయబార కార్యాలయం నుంచి రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌ రూ.1.35కోట్ల గ్రాంట్‌ పొందిందని ఆరోపించారు. అది ఎఫ్‌సీఆర్‌ఏ (FCRA) నిబంధనలకు విరుద్ధమ‌న్నారు. అందువల్లే దాని రిజిస్ట్రేషన్‌ను కేంద్ర హోంశాఖ రద్దు చేసింది. చైనా మీద నెహ్రూకు ఉన్న ప్రేమ కారణంగానే ఐరాస భద్రతా మండలిలో భారత్‌ శాశ్వత సభ్యత్వాన్ని త్యాగం చేయాల్సి వచ్చిందని అమిత్‌ షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.


Next Story