కాంగ్రెస్ స‌హా అన్ని పార్టీలు కుల, మత ప్రాతిపదికన ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నాయి

All political parties, including mine, create divide in society. తన పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలు కుల, మత ప్రాతిపదికన ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నాయని

By Medi Samrat  Published on  20 March 2022 11:17 AM GMT
కాంగ్రెస్ స‌హా అన్ని పార్టీలు కుల, మత ప్రాతిపదికన ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నాయి

తన పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలు కుల, మత ప్రాతిపదికన ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. అయితే.. ఈ తేడాలతో సంబంధం లేకుండా సమాజం ఐక్యంగా ఉండాలని.. మతం, కులంతో సంబంధం లేకుండా అందరికీ న్యాయం జ‌ర‌గాల‌ని అన్నారు.

రాజకీయ పార్టీలు మతం, కులం, ఇతర విషయాల ఆధారంగా 24x7 విభజనను సృష్టించవచ్చు. నా (కాంగ్రెస్)తో సహా ఏ పార్టీని నేను క్షమించడం లేదు.. పౌర సమాజం కలిసి ఉండాలి. కుల, మతాలకు అతీతంగా అందరికీ న్యాయం జరగాలని జమ్మూలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆజాద్ అన్నారు. జమ్మూకశ్మీర్‌లో జరిగిన దానికి పాకిస్థాన్‌ ఉగ్రదాడులే కారణమని గులాం నబీ ఆజాద్ అన్నారు. ఇది హిందువులు, కాశ్మీరీ పండిట్లు, కాశ్మీరీ ముస్లింలు, డోగ్రాలందరినీ ప్రభావితం చేసిందని అన్నారు.

ఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రం ది కశ్మీర్ ఫైల్స్ పై వివాదం చెలరేగిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా క‌థ 1990లలో లోయ నుండి హిందువుల వలసల చుట్టూ తిరుగుతుంది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విమర్శకులు, ప్రేక్షకుల నుండి మిశ్రమ ఆదరణ ఉన్నప్పటికీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అధికార బిజెపికి చెందిన పలువురు నాయకులు సహా కేంద్ర ప్రభుత్వం నుండి మద్దతు లభించింది.













Next Story