నలుగురు టెర్ర‌రిస్టులు అరెస్ట్‌.. ఆ ఉగ్రవాద గ్రూప్‌తో లింకులు..!

అల్-ఖైదాతో సంబంధం ఉన్న నలుగురు ఉగ్రవాదులను గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసింది.

By Medi Samrat
Published on : 23 July 2025 7:35 PM IST

నలుగురు టెర్ర‌రిస్టులు అరెస్ట్‌.. ఆ ఉగ్రవాద గ్రూప్‌తో లింకులు..!

అల్-ఖైదాతో సంబంధం ఉన్న నలుగురు ఉగ్రవాదులను గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసింది. ఏటీఎస్ వారి ఫొటోలను కూడా విడుదల చేసింది. వార్తా సంస్థ ANI ప్రకారం, అరెస్టయిన వ్యక్తులు AQISతో సంబంధాలు కలిగి ఉన్నారు.

ఈ విషయంలో ఏటీఎస్ ఇంకా పూర్తి సమాచారం ఇవ్వలేదు. త్వరలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పూర్తి సమాచారం అందజేస్తామని గుజరాత్ ఏటీఎస్ డీఐజీ సునీల్ జోషి తెలిపారు.

గుజరాత్ ఏటీఎస్ అరెస్టు చేసిన ఉగ్రవాదులు నకిలీ కరెన్సీ రాకెట్‌లో పాలుపంచుకుని తీవ్రవాద గ్రూపు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఏటీఎస్ గుజరాత్, ఢిల్లీ, నోయిడా నుంచి వారిని అరెస్టు చేసింది. సోషల్ మీడియా ద్వారా యువ‌త‌ను రిక్రూట్ చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

ఉగ్రవాదులను మహ్మద్ ఫైక్, మహ్మద్ ఫర్దీన్, సైఫుల్లా ఖురేషి, జీషన్ అలీగా గుర్తించారు. ఉగ్రవాదులందరూ అల్ ఖైదా భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, సందేహాస్పద యాప్‌లను ఉపయోగించారు. వారి చాట్‌లు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై విశ్లేషణ జరుగుతోంది. నిందితులు తీవ్రవాద గ్రూపుతో చాలా కాలంగా సంబంధం కలిగి ఉన్నారని అధికారులు తెలిపారు. వారు మాట్లాడే యాప్ మెసేజ్ పంపిన తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యేది. నలుగురిని ప్రస్తుతం విచారిస్తున్నారు.

Next Story