మెడికల్ కాలేజీ హాస్టల్‌పై కూలిన విమానం

అహ్మదాబాద్ లో విమాన ప్రమాదంపై అధికారులు స్పందించారు.

By Medi Samrat
Published on : 12 Jun 2025 4:49 PM IST

మెడికల్ కాలేజీ హాస్టల్‌పై కూలిన విమానం

అహ్మదాబాద్ లో విమాన ప్రమాదంపై అధికారులు స్పందించారు. మెడికల్ కాలేజీ హాస్టల్ మెస్ పై విమానం కూలడంతో అనేక మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్‌లోని బిజె మెడికల్ కాలేజీ విద్యార్థుల హాస్టల్‌పై కూలిపోయింది.

విమానంలో 242 మంది ప్రయాణికులు ఉండ‌గా.. వీరిలో 169 మంది భారతీయ పౌరులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, ఒక కెనడియన్, ఏడుగురు పోర్చుగీస్ పౌరులు ఉన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు.

ఎయిరిండియా విమానం కూలిపోవడంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

అహ్మదాబాద్‌లో చిక్కుకున్న ప్రయాణికుల కోసం భారత రైల్వే ప్రత్యేక వందే భారత్ రైళ్లను నడుపుతుంది. ప్రయాణీకుల కోసం అవసరమైనన్ని రైళ్లు నడుస్తాయని రైల్వే తెలిపింది.

Next Story