242 మంది ప్రయాణికులు, సిబ్బందితో లండన్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే ఒక హాస్టల్లోకి దూసుకెళ్లింది. భారీ శబ్దం వచ్చింది. తమకు భూకంపంలా అనిపించిందని ప్రమాద స్థలానికి పరుగెత్తిన ఒక వ్యక్తి చెప్పాడు. దట్టమైన పొగ కమ్ముకుందని, శిథిలాలు ఆ ప్రాంతమంతా చెల్లాచెదురుగా పడి ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
"తాము ఇంట్లో ఉన్నప్పుడు మేము ఒక పెద్ద శబ్దం విన్నాము. ఏమి జరిగిందో చూడటానికి మేము బయటకు వెళ్ళినప్పుడు, గాలిలో దట్టమైన పొగ ఉంది. కూలిపోయిన విమానం, మృతదేహాలు, శిథిలాలు చెల్లాచెదురుగా ఉన్నాయి" అని మరో ప్రత్యక్ష సాక్షి చెప్పారు.
బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం ప్రమాదం దేశాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. 232 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బందితో కూడిన ఈ విమానం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని మేఘనినగర్ ప్రాంతంలో కూలిపోయింది.