9 రోజుల్లో 58 మరణాలు.. 16 రోజుల్లోనే 23 రెట్లు పెరిగిన కొవిడ్‌ కేసులు

దేశంలో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 378 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

By Medi Samrat
Published on : 8 Jun 2025 2:34 PM IST

9 రోజుల్లో 58 మరణాలు.. 16 రోజుల్లోనే 23 రెట్లు పెరిగిన కొవిడ్‌ కేసులు

దేశంలో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 378 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 6,000 దాటింది. గ‌డిచిన 9 రోజుల్లో 58 మరణాలు సంభ‌వించ‌గా.. గత 24 గంటల్లో కోవిడ్ కారణంగా 6 మరణాలు సంభవించాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. కరోనా కార‌ణంగా ఎక్కువగా ప్రభావితమైన రాష్ట్రం కేరళ. కేరళ తర్వాత గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీల‌లో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. అయితే.. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కోవిడ్ కొత్త వేరియంట్ పెద్ద‌ ప్రమాదకరమైనది కాదు.

గత 48 గంటల్లో దేశంలో కోవిడ్ కేసులు 769 మంది పెరిగాయి. ఈ కేసులన్నీ చాలా తేలికపాటివి. రోగి ఇంటి సంరక్షణలో కోలుకోవచ్చు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. అరుణాచల్ ప్రదేశ్, మిజోరంలలో మాత్రమే కోవిడ్ యాక్టివ్ కేసులు లేవు.

మే 22 న దేశంలో 257 యాక్టివ్ కేసులు మాత్రమే ఉడ‌గా.. గ‌డిచిన 9 రోజుల‌లో కేసుల పెరుగుదల తరువాత ఈ సంఖ్య 6,133 కి చేరుకుంది. ఆక్సిజన్, ఐసోలేషన్ బెడ్లు, వెంటిలేటర్లు, అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది.

యాక్టివ్ కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాలు

కేరళ - 1950

గుజరాత్ - 822

పశ్చిమ బెంగాల్ - 693

ఢిల్లీ - 686

మహారాష్ట్ర - 595

Next Story