ముంబైలో ఘోరం..పాదచారులపైకి దూసుకెళ్లిన బస్సు, నలుగురు మృతి

మహారాష్ట్ర రాజధాని ముంబైలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది

By -  Knakam Karthik
Published on : 30 Dec 2025 10:22 AM IST

National News, Maharashtra, Mumbai, Road Accident, Four Died

ముంబైలో ఘోరం..పాదచారులపైకి దూసుకెళ్లిన బస్సు, నలుగురు మృతి

మహారాష్ట్ర రాజధాని ముంబైలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భాండుప్ పశ్చిమ రైల్వే స్టేషన్ రోడ్ వద్ద రివర్స్ తీస్తున్న BEST బస్సు అదుపు తప్పి రోడ్డుపై ఉన్న పలువురిని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి.

సోమవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. సమాచారం అందగానే ముంబై అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, BEST అధికారులు, 108 అంబులెన్స్‌లు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు

Next Story