పెళ్లి నుంచి తిరిగొస్తుండ‌గా రోడ్డు ప్రమాదం.. 9 మంది దుర్మ‌ర‌ణం

జార్ఖండ్ రాష్ట్రం పురూలియా జిల్లాలోని బల్‌రాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నమ్‌సోల్ గ్రామ సమీపంలోని జాతీయ రహదారి-18పై శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ట్రైలర్, బొలెరో ఢీకొన్న ప్రమాదంలో బొలెరోలో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది మృతి చెందారు.

By Medi Samrat
Published on : 20 Jun 2025 11:23 AM IST

పెళ్లి నుంచి తిరిగొస్తుండ‌గా రోడ్డు ప్రమాదం.. 9 మంది దుర్మ‌ర‌ణం

జార్ఖండ్ రాష్ట్రం పురూలియా జిల్లాలోని బల్‌రాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నమ్‌సోల్ గ్రామ సమీపంలోని జాతీయ రహదారి-18పై శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ట్రైలర్, బొలెరో ఢీకొన్న ప్రమాదంలో బొలెరోలో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది మృతి చెందారు. ప్ర‌మాదంలో కొంతమంది అక్కడికక్కడే మరణించారని, మరికొందరు గాయపడిన వారిని బలరాంపూర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారని పోలీసులు తెలిపారు.

మృతులు నీమ్‌డిహ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్రీలోని తిలాయితాండ్ గ్రామ నివాసితులు. మృతుల‌ను బీరు మహతో, అజయ్ మహతో, విజయ్ మహతో, స్వపన్ మహతో, గురుపద్ మహతో, శశాంక్ మహతో, చిత్తా మహతో, కృష్ణ మహతో, చంద్రమోహన్ మహతోగా గుర్తించారు. ఈ విషయం తెలియగానే తిలాయితాండ్ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతులు ఇచాఘర్ పోలీస్ స్టేషన్‌లోని చిరుగోడ గ్రామం నుండి బారాబజార్ పోలీస్ స్టేషన్‌లోని అదబ్నా గ్రామానికి పెళ్లికి వెళ్లారు. తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.

Next Story