కొత్త‌గా ఎన్నికైన‌ 82 మంది జిల్లా పరిషత్ సభ్యులపై క్రిమినల్ కేసులు

82 Zilla Parishad members have criminal cases against them. ఒడిశాలో కొత్తగా ఎన్నికైన 82 మంది జిల్లా పరిషత్ (జెడ్‌పి) సభ్యులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని

By Medi Samrat  Published on  17 May 2022 1:44 PM GMT
కొత్త‌గా ఎన్నికైన‌ 82 మంది జిల్లా పరిషత్ సభ్యులపై క్రిమినల్ కేసులు

ఒడిశాలో కొత్తగా ఎన్నికైన 82 మంది జిల్లా పరిషత్ (జెడ్‌పి) సభ్యులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఒడిశా ఎలక్షన్ వాచ్ అండ్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) మంగళవారం ఒక నివేదికలో తెలిపింది. ఒడిశాలో ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన 851 మంది జెడ్‌పి అభ్యర్థుల్లో 726 మంది అఫిడవిట్‌లను ప‌రిశీలించిన తర్వాత ఎడిఆర్ మంగళవారం క్రిమినల్ కేసులు, ఆస్తులు, విద్య, వయస్సుకు సంబంధించిన డేటాను వెల్ల‌డించింది.

ఈ నివేదికను రూపొందించే సమయానికి మిగిలిన అఫిడవిట్‌లు వెబ్‌సైట్‌లో అందుబాటులో లేకపోవటంతో వాటిని విశ్లేషించలేదు. 726 జెడ్‌పి సభ్యులలో 82 మంది సభ్యులు తమపై ఉన్న‌ క్రిమినల్ కేసులను అఫిడవిట్‌లలో పేర్కొన్నారు. వీరిలో 65 (9 శాతం) జెడ్‌పి సభ్యులు హత్యాయత్నం, మహిళలపై నేరాలు మొదలైన వాటితో సహా తీవ్రమైన నేరారోపణలను ఎదుర్కొంటున్నారని నివేదిక పేర్కొంది. ఎన్నికైన 15 మంది సభ్యులు హత్యాయత్నం (ఐపీసీ సెక్షన్-307) కేసులను ప్రకటించగా.. 12 మంది సభ్యులు మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను ఎదుర్కొంటున్నారు.

నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని అధికార బీజేడీ నుండి ఎన్నికైన‌ 661 జెడ్‌పి సభ్యులలో 66 (10 శాతం) సభ్యులు స్వయంగా క్రిమినల్ కేసులను ప్రకటించగా.. బిజెపికి చెందిన 37 మంది జెడ్‌పి సభ్యులలో ఆరుగురు (16%) ఇలాంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.

ఎన్నికైన 22 మంది కాంగ్రెస్ సభ్యులలో 7 (32 శాతం), జేఎంఎం నుండి 3 మంది సభ్యులలో 1 (33 శాతం), సీపీఐ నుండి ఎన్నికైన‌ ఒక సభ్యునిలో ఒకరు (100 శాతం), ఇద్దరు స్వతంత్ర సభ్యులలో ఒకరు (50 శాతం) తమ అఫిడవిట్‌లలో తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు.

726 జిల్లా పరిషత్ సభ్యులలో 95 (13 శాతం) మంది కోటీశ్వరులు ఉండ‌గా.. వీరిలో అత్యధికంగా 90 మంది సభ్యులు అధికార బీజేడీ నుండి ఉన్నారు. ముగ్గురు బీజేడీ సభ్యులు -- రెబాటి నాయక్, గీతారాణి మాలిక్, కుంతీ ప్రధాన్ వరుసగా రూ. 18.68 కోట్లు, రూ. 17.06 కోట్లు, రూ. 10.21 కోట్ల మొత్తం ఆస్తిని ప్రకటించారు. ఈ సభ్యులు ఆస్తుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. బీజేపీకి చెందిన 37 మంది జెడ్పీ సభ్యుల్లో ముగ్గురు, కాంగ్రెస్‌కు చెందిన 22 మంది జెడ్పీ సభ్యుల్లో ఇద్దరు కోటి రూపాయలకు పైగా ఆస్తులున్నట్లు ప్రకటించారు. ఒడిశాలో ఒక్కో జిల్లా పరిషత్ సభ్యుని ఆస్తుల సగటు రూ.56.60 లక్షలుగా నివేదిక పేర్కొంది.

451 మంది సభ్యులు తమ విద్యార్హత 5వ తరగతి, 12వ తరగతి ఉత్తీర్ణత మధ్య ఉన్నట్లు ప్రకటించారు. 256 (35 శాతం) మంది సభ్యులు గ్రాడ్యుయేట్, అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగి ఉన్నారని ఎడిఆర్ తదుపరి నివేదిక పేర్కొంది. డిప్లొమా హోల్డర్లు ఆరుగురు సభ్యులు ఉన్నారు. 726 మంది జిల్లా పరిషత్‌ సభ్యుల్లో 385 మంది (53 శాతం) మహిళలు ఉన్నారని పేర్కొంది.




















Next Story