పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌

అస్సాంలోని డిబ్లాంగ్ స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు తప్పింది. లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 8 కోచ్‌లు దిబాలాంగ్ వద్ద పట్టాలు తప్పాయి

By Medi Samrat  Published on  17 Oct 2024 2:14 PM GMT
పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌

అస్సాంలోని డిబ్లాంగ్ స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు తప్పింది. లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 8 కోచ్‌లు దిబాలాంగ్ వద్ద పట్టాలు తప్పాయి. అయితే ఈ ఘ‌ట‌న‌లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని రైల్వే అధికార ప్రతినిధి తెలిపారు. లండింగ్ డివిజన్‌లోని లుమ్‌డింగ్-బాదర్‌పూర్ హిల్ సెక్షన్‌లో ఈ ప్రమాదం జరిగింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా ఈ ప్రమాదం గురించి తన అధికారిక సోషల్ హ్యాండిల్ ఎక్స్‌లో సమాచారం ఇచ్చారు.

ఈరోజు ఉదయం అగర్తల నుంచి బయలుదేరిన ముంబై వెళ్లే లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 3:55 గంటలకు అస్సాంలోని డిబ్లాంగ్ స్టేషన్ వద్ద పట్టాలు తప్పిందని రైల్వే ప్రతినిధి తెలిపారు. రైలులోని పవర్ కార్, ఇంజన్ సహా 8 కోచ్‌లు పట్టాలు తప్పాయి. అయితే, ఎటువంటి ప్రాణనష్టం లేదా తీవ్రమైన గాయాలవ‌డం వంటివి సంభవించలేదు. రెస్క్యూ, పునరుద్ధరణ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి సీనియర్ అధికారులు లుమ్‌డింగ్ నుండి స్పాట్‌కు బయలుదేరారు. లుమ్‌డింగ్-బాదర్‌పూర్ సింగిల్ లైన్ సెక్షన్‌లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. లుమ్‌డింగ్-బాదర్‌పూర్ సింగిల్ లైన్ సెక్షన్‌లో రైళ్ల రాకపోకలను నిలిపివేసినట్లు సీపీఆర్వో తెలిపారు. దీనితో పాటు హెల్ప్‌లైన్ నంబర్లు 03674 263120, 03674 263126 జారీ చేశారు.

Next Story