లడ్డూ మహోత్సవ్‌లో విషాదం.. కూలిన వేదిక.. ఏడుగురు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో మంగళవారం జైన నిర్వాణ ఉత్సవంలో ఒక వేదిక కూలిపోవడంతో ఏడుగురు మృతి చెందగా.. మహిళలు, పిల్లలు సహా 40 మంది గాయపడ్డారు.

By అంజి  Published on  28 Jan 2025 11:57 AM IST
7 killed, 40 injured , stage collapse, Jain religious event, Uttarpradesh, Baghpat

లడ్డూ మహోత్సవ్‌లో విషాదం.. కూలిన వేదిక.. ఏడుగురు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో మంగళవారం జైన నిర్వాణ ఉత్సవంలో ఒక వేదిక కూలిపోవడంతో ఏడుగురు మృతి చెందగా.. మహిళలు, పిల్లలు సహా 40 మంది గాయపడ్డారు. బాగ్‌పత్‌లోని బగౌర్‌లో లడ్డూ వేడుకలో వెదురు, కలపతో చేసిన తాత్కాలిక వేదిక కూలిపోవడంతో ఈ సంఘటన జరిగింది. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జైన సన్యాసుల సమక్షంలో ఆదినాథునికి లడ్డూలు సమర్పించేందుకు వందలాది మంది భక్తులు ఈ ఉదయం అక్కడికి చేరుకున్నారు. అయితే భక్తుల కోసం సిద్ధం చేసిన తాత్కాలిక వేదిక వారి బరువుతో కూలిపోయి, డజన్ల కొద్దీ చిక్కుకుపోయిందని అధికారులు తెలిపారు.

"దాదాపు 30 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 40 మంది గాయపడ్డారు. వారు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రథమ చికిత్స అందించిన తర్వాత ఇరవై మంది ఇప్పటికే విడుదలయ్యారు" అని బాగ్‌పత్ జిల్లా మేజిస్ట్రేట్ అస్మితా లాల్ తెలిపారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు సహా అధికారులు పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ.. భక్తులకు చికిత్స అందించే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జిల్లా అధికారులను ఆదేశించారు.

Next Story