దేశంలో మంకీ ఫీవర్ కలకలం

57-year-old woman from Karntaka's Thirthahalli tests positive for Kyasanur Forest Disease. దేశవ్యాప్తంగా కరోనా థ‌ర్డ్ వేవ్ నేఫ‌థ్యంలో కర్ణాటకలోని శివమొగ్గలో మంకీ ఫీవ‌ర్‌

By Medi Samrat
Published on : 22 Jan 2022 7:53 PM IST

దేశంలో మంకీ ఫీవర్ కలకలం

దేశవ్యాప్తంగా కరోనా థ‌ర్డ్ వేవ్ నేఫ‌థ్యంలో కర్ణాటకలోని శివమొగ్గలో మంకీ ఫీవ‌ర్‌ కేసు కనుగొనబడింది. శివమొగ్గలోని తీర్థహళ్లిలోని కుడిగే గ్రామానికి చెందిన‌ 57 ఏళ్ల మహిళ ఈ ఫారెస్ట్ డిసీజ్‌తో బాధపడుతోంది. మహిళ కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. దీంతో ఆమె రక్త నమూనాను పరీక్ష కోసం పంపారు వైద్యులు. అందులో ఆమె క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ తో బాధపడుతున్నట్లు తేలింది. దీనినే మంకీ ఫీవ‌ర్‌ అని కూడా అంటారు.

శివమొగ్గలో మంకీ ఫీవ‌ర్ కేసు న‌మోద‌వ‌డంతో గ్రామ‌స్థులు, వైద్యారోగ్య శాఖలో ఆందోళన పెరిగింది. దట్టమైన అడవుల మధ్య ఉన్న కుడిగే గ్రామంలో ఈ కేసు న‌మోద‌వ‌డం ఈ ఆందోళ‌న‌కు కార‌ణం. శుక్రవారం సాయంత్రం మణిపాల్‌కు రిఫర్ చేయడానికి ముందు మహిళను మొదట తీర్థహళ్లి తాలూకా ఆసుపత్రిలో చేర్చారు. శివమొగ్గ జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ రాజేష్ ఎస్ ఉరగిహల్లి మాట్లాడుతూ.. మహిళలో కేఎఫ్‌డీ లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని తెలిపారు.

మంకీ ఫీవ‌ర్‌ వైరస్ ఫ్లావివైరస్ జాతికి చెందినది. ఇది ఒక రకమైన పురుగులకు సోకిన పేలు. దీనిని ఫ్లీ అని కూడా అంటారు. ఇది వ్యాధి సోకిన కోతి లేదా వ్యాధితో మరణించిన కోతితో సంబంధం కలిగి ఉన్న వ్య‌క్తుల‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ప్రస్తుతం మంకీ ఫీవర్ కోసం 50 నమూనాలను పరీక్షించగా.. ఒకటి పాజిటివ్‌గా నిర్ధారించబడింది. ఇందుకు మహిళ వ్యాధికి సంబంధించి వ్యాక్సిన్ కూడా వేసుకుంది. ఇదిలావుంటే.. సాగర్ తాలూకాలోని ఆర్లగోడు డిసెంబర్ 2019లో మంకీ ఫీవర్ బారిన పడింది. అప్పుడు అక్క‌డ‌ 22 మంది ప్రాణాలు కోల్పోయారు. శివమొగ్గలో గత రెండేళ్లలో ఈ వ్యాధితో మొత్తం 26 మంది చనిపోయారు.


Next Story