55 రైళ్లు రద్దు చేసిన.. దక్షిణ మధ్య రైల్వే.. ఎప్పటి వరకు అంటే.!

55 South Central Railway Trains Stand Cancelled. కరోనా మహమ్మారి విజృంభణ ఆగకపోవడంతో.. దక్షిణ మధ్య రైల్వే 55 రైళ్ల రద్దును వారం రోజుల పాటు పొడిగించాలని నిర్ణయించింది.

By అంజి
Published on : 25 Jan 2022 3:45 AM

55 రైళ్లు రద్దు చేసిన.. దక్షిణ మధ్య రైల్వే.. ఎప్పటి వరకు అంటే.!

కరోనా మహమ్మారి విజృంభణ ఆగకపోవడంతో.. దక్షిణ మధ్య రైల్వే 55 రైళ్ల రద్దును వారం రోజుల పాటు పొడిగించాలని నిర్ణయించింది. ప్రబలంగా ఉన్న మహమ్మారి పరిస్థితి కారణంగా ఇప్పుడు ప్యాసింజర్ రైళ్లు జనవరి 31 వరకు రద్దు చేయబడతాయని దక్షిణ మధ్య రైల్వే సోమవారం ప్రకటించింది. పెద్ద సంఖ్యలో లోకో-పైలట్‌లు కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయ్యినట్లు తెలిసింది. అయితే రైల్వే అధికారి మాట్లాడుతూ.. రద్దు చేయబడిన సేవలు అన్‌రిజర్వ్డ్ రైళ్లు అని స్పష్టం చేశారు. "రిజర్వ్ చేయని రైళ్లలో, రిజర్వ్ చేయబడిన రైలు సేవలతో పోల్చితే కోవిడ్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ. అందుకే ఈ 55 సర్వీసులను రద్దు చేశాం'' అని వివరించారు.

శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని గమ్యస్థానాలను కవర్ చేసే 55 రైళ్లను రద్దు చేసింది. వాస్తవానికి జనవరి 24, సోమవారం వరకు రద్దు చేయబడిన ప్యాసింజర్ రైలు సేవలు ఇప్పుడు సోమవారం, జనవరి 31 వరకు రద్దు చేయబడ్డాయి. ఈ రైళ్లలో సికింద్రాబాద్, తిరుపతి, విజయవాడ, కర్నూలు, కలబుర్గి మరియు చెన్నై వంటి ప్రధాన స్టేషన్ల నుండి అనేక రైళ్లు ఉన్నాయి. ఎస్‌సీఆర్‌ సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు, నాందేడ్ యొక్క ఆరు విభాగాలను కలిగి ఉంది. ప్రాథమికంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలకు సేవలు అందిస్తోంది.

Next Story