మొత్తం 24 నగరాలు పాకిస్తాన్ టార్గెట్

మే 8వ తేదీ రాత్రి 8.00 గంటల నుంచి 11.30 గంటల మధ్య పాకిస్తాన్ భారతదేశంలోని అనేక నగరాలపై ఏకకాలంలో డ్రోన్ దాడులను ప్రారంభించిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి.

By Medi Samrat
Published on : 9 May 2025 4:53 PM IST

మొత్తం 24 నగరాలు పాకిస్తాన్ టార్గెట్

మే 8వ తేదీ రాత్రి 8.00 గంటల నుంచి 11.30 గంటల మధ్య పాకిస్తాన్ భారతదేశంలోని అనేక నగరాలపై ఏకకాలంలో డ్రోన్ దాడులను ప్రారంభించిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లోని 24 నగరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ దాదాపు 500 చిన్న డ్రోన్‌లను మోహరించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. L70, ZU-23, షిల్కా, ఆకాష్ వంటి క్షిపణి నిరోధక వ్యవస్థలను ఉపయోగించి పాకిస్తాన్ డ్రోన్ దాడిని భారత సైన్యం, వైమానిక దళం విజయవంతంగా తిప్పికొట్టాయి.

మే 7వ తేదీ తెల్లవారుజామున పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారతదేశం దాడి చేయడంతో ఉద్రిక్తత పెరిగింది. ఆపరేషన్ సిందూర్ మిషన్ ద్వారా ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు భారతదేశం చెప్పింది. అయితే, మే 8న జమ్మూ, పఠాన్‌కోట్‌లోని భారత సైనిక స్థావరాలతో సహా భారతదేశంలోని అనేక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ప్రతీకార దాడికి తెగబడింది.

Next Story