బీజేపీ కేంద్ర కార్యాలయంలో కరోనా కలకలం.. 42 మంది పాజిటివ్‌

42 Staff Test Positive At BJP Headquarters In Delhi. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలోని 42 మంది సిబ్బందికి కోవిడ్-19 పాజిటివ్‌గా తేలిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

By అంజి  Published on  12 Jan 2022 8:47 AM GMT
బీజేపీ కేంద్ర కార్యాలయంలో కరోనా కలకలం.. 42 మంది పాజిటివ్‌

ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలోని 42 మంది సిబ్బందికి కోవిడ్-19 పాజిటివ్‌గా తేలిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బిజెపి కోర్ గ్రూప్ సమావేశానికి ముందు సోమవారం మాస్ టెస్టింగ్ జరిగింది, ఆ తర్వాత 42 మంది సిబ్బందికి పాజిటివ్ అని తేలింది. కరోనా సోకిన వారిలో చాలా మంది పారిశుధ్య కార్మికులు అని తెలిసింది. వారందరినీ సెల్ఫ్‌ ఐసోలేట్‌ చేసుకోవాలని కోరారు.సెంట్రల్ ఢిల్లీలోని మింటో రోడ్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయం తర్వాత పూర్తిగా శానిటైజ్ చేయబడిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

బిజెపి కొత్త ప్రోటోకాల్‌ను ప్రారంభించింది, ఇక్కడ ఏదైనా పెద్ద సమావేశానికి ముందు ఢిల్లీలోని వారి ప్రధాన కార్యాలయంలోని సిబ్బంది అందరూ కోవిడ్‌-19 పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. "కార్యాలయానికి సంబంధించిన ముఖ్యమైన కార్యకలాపాలలో నిమగ్నమైన వ్యక్తులు మాత్రమే ప్రధాన కార్యాలయానికి వస్తున్నారు" అని పేరు తెలియని బిజెపి నాయకులు ఒకరు తెలిపారు. నిన్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై బిజెపి కోర్ కమిటీ సమావేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈరోజు రెండో విడత సమావేశం జరగనుంది.

సోమవారం బిజెపి చీఫ్ జెపి నడ్డా కరోనా పాజిటివ్‌ అని నిర్దారణ అయ్యింది. "ప్రాథమిక లక్షణాలను చూసిన తర్వాత నేను నా కోవిడ్-19 పరీక్ష చేయించుకున్నాను. నా రిపోర్ట్ పాజిటివ్‌గా వచ్చింది. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. డాక్టర్ల సలహా మేరకు నేను ఒంటరిగా ఉన్నాను. గత కొద్దికాలంగా నన్ను సంప్రదించిన వారందరూ కరోనా పరీక్షలు చేసుకోవాలని అభ్యర్థించారు' అని నడ్డా హిందీలో ట్వీట్ చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై, బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్‌ భట్‌లకు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది.

మంగళవారం, ఉత్తరప్రదేశ్‌లో పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా ఉన్న బిజెపి అగ్ర నాయకుడు రాధా మోహన్ సింగ్‌ కోవిడ్ -19 పాజిటివ్ వచ్చింది. బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు కూడా అయిన రాధా మోహన్ సింగ్ సోమవారం రాత్రి లక్నోలో జరిగిన పార్టీ అగ్రనేతల సమావేశానికి హాజరయ్యారు, అక్కడ యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యుపి బిజెపి చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్ కూడా పాల్గొన్నారు. రాధా మోహన్ సింగ్ హోమ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఫిబ్రవరి 10 నుండి జరిగే ఏడు దశల అసెంబ్లీ ఎన్నికల కోసం స్వతంత్ర దేవ్ సింగ్ మంగళవారం ఉదయం బిజెపి ఇంటింటికీ ప్రచారంతో ముందుకు సాగారు. దేశంలో ఈరోజు 1,94,720 తాజా కోవిడ్‌-19 ఇన్‌ఫెక్షన్లు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 11 శాతం పెరిగింది.

Next Story