ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 40 లక్షల మంది భారతీయులు చనిపోయారు : రాహుల్ గాంధీ

40 lakh Indians died due to govt's negligence. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా, కరోనావైరస్ మహమ్మారి సమయంలో 40 లక్షల మంది భారతీయులు

By Medi Samrat
Published on : 17 April 2022 3:30 PM

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 40 లక్షల మంది భారతీయులు చనిపోయారు : రాహుల్ గాంధీ

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా, కరోనావైరస్ మహమ్మారి సమయంలో 40 లక్షల మంది భారతీయులు మరణించారని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆదివారం నాడు పేర్కొన్నారు. అదే సమయంలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆయన మరోసారి డిమాండ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మరణాల సంఖ్యను బహిరంగపరచడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రయత్నాలను భారతదేశం అడ్డుకుంటున్నదని న్యూయార్క్ టైమ్స్ నివేదిక యొక్క స్క్రీన్‌షాట్‌ను రాహుల్ ట్విట్టర్‌లో పంచుకున్నారు.

రాహుల్ గాంధీ ట్వీట్‌లో.. "మోదీ జీ నిజం మాట్లాడరు, మాట్లాడనివ్వరు. ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఎవరూ చనిపోలేదని అతను ఇప్పటికీ అబద్ధం చెబుతున్నాడు!" కోవిడ్ సమయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఐదు లక్షల మంది కాదు, 40 లక్షల మంది భారతీయులు చనిపోయారు, మోదీ ప్రతి బాధిత కుటుంబానికి 4 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని నేను ఇంతకుముందు కూడా చెప్పానని రాసుకొచ్చారు.









Next Story