మహమ్మారి కలకలం.. 338 రెసిడెంట్ వైద్యులకు కరోనా పాజిటివ్

338 resident doctors in Maharashtra test positive for COVID-19. మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. సాధారణ ప్రజలతో పాటు

By అంజి  Published on  7 Jan 2022 4:51 AM GMT
మహమ్మారి కలకలం.. 338 రెసిడెంట్ వైద్యులకు కరోనా పాజిటివ్

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. సాధారణ ప్రజలతో పాటు వైద్యులను కూడా కరోనా మహమ్మారి వదలడం లేదు. వివిధ ఆసుపత్రులకు చెందిన మొత్తం 338 మంది రెసిడెంట్ వైద్యులు గత నాలుగు రోజుల్లో కోవిడ్-19కి పాజిటివ్‌గా నిర్దారణ అయ్యిందని స్టేట్ అసోసియేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అధ్యక్షుడు డాక్టర్ అవినాష్ దహిఫాలే తెలిపారు. అంతకుముందు గురువారం, మహారాష్ట్రలో 36,265 కొత్త కొవిడ్‌-19 కేసులు నమోదయ్యాయని హెల్త్ బులెటిన్ పేర్కొంది.

గురువారం మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,14,847కి చేరింది. 36,265 కొత్త కోవిడ్‌-19 కేసులలో, 20,181 కొత్త ఇన్ఫెక్షన్లు ముంబైలో నమోదయ్యాయి. నగరంలో కోవిడ్‌-19 యొక్క క్రియాశీల కేసులు గురువారం 79,260కి చేరుకున్నాయి. రాష్ట్రంలో నిన్న కూడా 13 కోవిడ్ సంబంధిత మరణాలు నమోదయ్యాయి. 8,907 మంది ఇన్‌ఫెక్షన్ నుండి కోలుకోవడంతో కోలుకున్న వారి సంఖ్య 65,33,154కి చేరుకుంది. నిన్న హెల్త్ బులెటిన్ ప్రకారం, మహారాష్ట్రలో 79 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌-19 యొక్క కొత్త వేరియంట్ ఓమిక్రాన్‌ మొత్తం కేసులు 876 వద్ద ఉన్నాయి. అందులో 381 మంది రోగులు కోలుకున్నారు.

Next Story