ఢిల్లీ పేలుళ్లపై అనుచిత పోస్టులు.. సీఎం ఆగ్రహం
ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుళ్ల ఘటన ఎంతో మంది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
By - Medi Samrat |
ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుళ్ల ఘటన ఎంతో మంది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కొందరు మాత్రం దీనిపై పైశాచిక ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పేలుళ్లకు సంబంధించి సోషల్ మీడియాలో అనుచిత, అవమానకరమైన పోస్టులు పెట్టిన వారిపై అసోం ప్రభుత్వం యాక్షన్ లోకి దిగింది. రాష్ట్రవ్యాప్తంగా 15 మందిని అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుళ్లలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, ఈ విషాద ఘటనను కీర్తిస్తూ పోస్టులు పెట్టిన వారిపై అసోం పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు.
హింసను కీర్తించే వారిపై అసోం పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తారని, ఈ విషయంలో ఎలాంటి రాజీకి తావులేదని సీఎం తన పోస్టులో స్పష్టం చేశారు. "ఢిల్లీ పేలుళ్లపై అవమానకరమైన పోస్టులు పెట్టినందుకు అసోంలో ఇప్పటివరకు 15 మందిని అరెస్టు చేశాం. నిన్న రాత్రి ఆరుగురిని అరెస్టు చేయడంతో ఈ సంఖ్య 15కి చేరింది" అని ఆయన ట్వీట్ చేశారు. అరెస్టయిన వారిలో బొంగైగావ్కు చెందిన రఫీజుల్ అలీ, హైలకండికి చెందిన ఫరీదుద్దీన్ లస్కర్, లఖింపూర్కు చెందిన ఇనాముల్ ఇస్లాం, ఫిరోజ్ అహ్మద్, బార్పేటకు చెందిన షాహిల్ షోమన్ సిక్దార్, రకీబుల్ సుల్తాన్, హోజైకి చెందిన నసీమ్ అక్రమ్, కమ్రూప్కు చెందిన తస్లిమ్ అహ్మద్, దక్షిణ సల్మారాకు చెందిన అబ్దుర్ రోహిమ్ మొల్లా ఉన్నట్లు తెలిపారు.