ఈ నెల 6న‌ మరో పథకానికి శ్రీకారం చుట్టనున్న సీఎం జగన్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Nov 2020 6:07 AM GMT
ఈ నెల 6న‌ మరో పథకానికి శ్రీకారం చుట్టనున్న సీఎం జగన్‌

ఏపీ సీఎం జగన్ మరో భారీ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ఫుట్‌పాత్ లు, వీధుల్లో వస్తువులు, తినుబండారాలు విక్రయించే వ్యాప్తారులకు రూ.10వేల చొప్పున రుణాలు అందించే "జగనన్న తోడు" పథకాన్ని ఈ నెల 6న సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్‌ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఈ పథకం కింద బ్యాంకుల నుంచి చిరు వ్యాపారులకు రుణాలు ఇప్పించడంతో పాటు ఆ రుణాలపై అయ్యో వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. తీసుకున్న రుణాన్ని మాత్రం వాయిదాల పద్దతిలో లబ్ధిదారులు చెల్లిస్తే సరిపోతుంది. ఫుట్‌ పాత్ లు, వీధుల్లో తోపుడు బండ్లు, సైకిళ్లపై వివిధ వస్తువులు, కూరగాయలు, పండ్లు అమ్ముకుని జీవనం సాగించే వారితోపాటు రోడ్డు పక్కన టిఫిన్‌ సెంటర్లు నడిపే వారు, గంపలు లేదా బట్టలపై వివిధ వస్తువులు అమ్ముకునే వారంతా ఈ పథకం కింద లబ్ది పొందనున్నారు. సంప్రదాయ వృత్తులైన ఇత్తడి పని చేసేవారు, బొబ్బిలి వీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, కలంకారీ, తోలు బొమ్మల అమ్మకందారులతో పాటు కుమ్మరి వారికి సైతం ఈ పథకం కింద రుణాలు ఇస్తారు.

Next Story