అమెరికన్ తనఖా దిగ్గజ సంస్థ 'ఫ్యానీ మే' నైతికవిలువల ప్రాతిపదికన కింద దాదాపు 200 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. వారిలో ఎక్కువ మంది తెలుగువారు ఉన్నారు. జనవరిలో ఆపిల్ సంస్థ కుపెర్టినోలోని తన ప్రధాన కార్యాలయంలోని దాదాపు 50 మంది ఉద్యోగులను తొలగించింది, వారిలో కొంతమంది భారతీయులు కూడా ఉన్నారు. మోసాలకి పాల్పడ్డారనే ఆరోపణలపై వారిని విధుల నుండి తీసేశారు. సామూహిక తొలగింపులపై ఒక భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు దర్యాప్తు ప్రారంభించి, ఫ్యానీ మే నుండి వివరణ కోరాడు.
ఫెడరల్ నేషనల్ మార్ట్గేజ్ అసోసియేషన్ (ఫ్యానీ మే)లో 200 మంది భారతీయ-అమెరికన్ సిబ్బంది ఉన్నారు. ఫ్యానీ మే సంస్థ తాజాగా పునర్నిర్మాణ ప్రయత్నాలలో భాగంగా 700 మంది సిబ్బందిని తొలగించింది, ఇందులో మోసానికి పాల్పడిన వారు కూడా ఉన్నారు. "నైతిక కారణాల"పై ఫ్యానీ మే తొలగించిన 200 మంది సిబ్బందిలో ఎక్కువ మంది తెలుగువారే అని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక తెలిపింది.