అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత చమురు దిగుమతులపై కీలక వ్యాఖ్యలు చేశారు. వెనెజువెలా నుంచి చమురు దిగుమతుల్లో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ మాట్లాడుతూ, "చైనా చమురుపై గొప్ప ఒప్పందం కుదుర్చుకోవడం స్వాగతించదగినది. మేము ఇప్పటికే ఒక ఒప్పందం కుదుర్చుకున్నాము. భారతదేశం ప్రవేశిస్తోంది, మరియు వారు ఇరాన్ నుండి కొనుగోలు చేయడానికి బదులుగా వెనిజులా చమురును కొనుగోలు చేయబోతున్నారు. కాబట్టి, మేము ఇప్పటికే ఒప్పందం యొక్క భావనను రూపొందించాము..అని ట్రంప్ పేర్కొన్నారు.
దీనికి సంబంధించిన ఒప్పందంపై ఒక అవగాహనకు వచ్చామన్నారు. కానీ, ఇప్పటివరకు భారత ప్రభుత్వం ఈ అంశంపై ఏ అధికారిక ప్రకటన ఇవ్వలేదు. అమెరికా అధ్యక్షుడు చైనా కూడా వెనెజువెలా చమురు కోసం చర్చలు జరపవచ్చని, దానిని స్వాగతిస్తామన్నారు. అంతకుముందు, వెనిజులా అమెరికాకు 5.2 బిలియన్ డాలర్ల విలువైన "50 మిలియన్ బ్యారెళ్ల చమురు"ను ఆఫర్ చేసిందని ట్రంప్ అన్నారు, ఈ ప్రతిపాదనను వాషింగ్టన్ అంగీకరించిందని ఆయన చెప్పారు.