భారత్, పాకిస్తాన్ దేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య చర్చలు జరిగాయి. హాట్లైన్ ద్వారా భారత డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాకిస్థాన్ డీజీఎంఓ మేజర్ జనరల్ కాశిప్ చౌదరి మాట్లాడుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సిన చర్చలు, సాయంత్రానికి వాయిదా పడ్డాయి. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు, కాల్పుల విరమణ ఒప్పందాల అమలు, అనుకోని సంఘటనల నివారణ వంటి అంశాలపై ఈ చర్చలు సాగి ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
26 మంది పౌరులను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా, మే 7 తెల్లవారుజామున భారతదేశం 'ఆపరేషన్ సిందూర్'ను ప్రారంభించింది. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK) అంతటా తొమ్మిది ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులు చేసింది. అయితే శనివారం రెండు దేశాలు సీజ్ ఫైర్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించాయి