అమెరికా సాయుధ దళాల 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వాషింగ్టన్లో జరుగుతున్న సైనిక కవాతుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ను అతిథిగా ఆహ్వానించారనే వార్తలను అమెరికా తోసిపుచ్చింది. వార్తల్లో ఎలాంటి నిజం లేదని, విదేశీ సైనిక నాయకులను ఎవరినీ ఆహ్వానించలేదని వైట్ హౌస్ అధికారి ఒకరు చెప్పినట్లు వార్తా సంస్థ ANI నివేదించింది. జనరల్ మునీర్ను అమెరికా ఆహ్వానించినట్లు వచ్చిన నివేదికల తర్వాత ఈ వివరణ వచ్చింది.
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ వాషింగ్టన్ పర్యటన వార్తలతో అమెరికాలోని పాకిస్తాన్ సమాజం కూడా నిరసనలకు దిగింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీ మునీర్ పర్యటన సమయంలో అమెరికా రాజధానిలో నిరసన ప్రదర్శనలు చేస్తామని ప్రకటించింది. జూన్ 14న వాషింగ్టన్లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం వెలుపల పాకిస్తాన్-అమెరికన్లు నిరసనలకు దిగాలని పీటీఐ నేతలు పిలుపునిచ్చారు.