బంగారు గని కూలి.. 18 మంది దుర్మరణం

18 dead in goldmine collapse in southern Niger. బంగారు గని కూలి 18 మంది మరణించిన ఘటన దక్షిణ నైజర్‌లో చోటు చేసుకుంది. నైజీరియా సరిహద్దుకు సమీపంలోని

By అంజి  Published on  9 Nov 2021 6:10 AM GMT
బంగారు గని కూలి.. 18 మంది దుర్మరణం

బంగారు గని కూలి 18 మంది మరణించిన ఘటన దక్షిణ నైజర్‌లో చోటు చేసుకుంది. నైజీరియా సరిహద్దుకు సమీపంలోని ఆర్టిసానల్‌ గోల్డ్‌మైన్‌లో ఈ ప్రమాదం జరిగిందిన స్థానిక మేయర్‌ తెలిపారు. గ్యారిన్‌ - లిమాన్‌ బంగారు గని ప్రాంతంలో ఆర్టిసానల్‌ బావులు కూలి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 18 మంది మరణించగా మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గని అడుగున ఇంకా కొన్ని మృతదేహాలు ఉండవచ్చని స్థానికులు అంటున్నారు.

కొన్ని నెలల క్రితమే గ్యారిన్‌ - లిమాన్‌ బంగారు గనులను కనుగొన్నారు. అక్కడికి వేలాది మంది మైనర్లు చేరి బంగారం కోసం తవ్వకాలు జరుపుతున్నారు. గని కూలిన ఘటనలో వెలికి తీసిన మృతదేహాలను ఖననం చేశామని డాన్‌ ఇస్సా జిల్లా మేయర్‌ అడమౌ గురౌ తెలిపారు. దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో గోల్డ్‌ కోసం తవ్వకాలు జరుగుతున్నాయి. మట్టి అస్థిరతతో పాటు మైనర్లు ఉపయోగించిన కాలం చెల్లిన పద్ధతుల కారణంగా ఈ బంగారు గనుల్లో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.


Next Story