అబద్ధానికి, వాస్తవానికి మధ్య వ్యత్యాసాన్ని చెప్పడం అంత సులభం కాదు

US diplomat underlines Need for Fact Checking. మీడియా అందించే సమాచారం ఆధారంగా ప్రజలు అభిప్రాయాలను ఏర్పరచుకుంటారని..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 July 2022 1:46 PM GMT
అబద్ధానికి, వాస్తవానికి మధ్య వ్యత్యాసాన్ని చెప్పడం అంత సులభం కాదు

మీడియా అందించే సమాచారం ఆధారంగా ప్రజలు అభిప్రాయాలను ఏర్పరచుకుంటారని.. కాబట్టి కలుషితం కాని సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి కృషి చేయాలని US కాన్సులేట్ జనరల్ హైదరాబాద్‌లోని పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్ డేవిడ్ మోయర్ జర్నలిస్టులకు పిలుపునిచ్చారు. శనివారం ఓయూ క్యాంపస్‌లోని సీఎఫ్‌ఆర్‌డీ భవనంలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగం, ఉస్మానియా యూనివర్శిటీ, యూఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ సంయుక్తంగా నిర్వహించిన 'నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ కౌంటర్ ఇన్ఫర్మేషన్‌'లో మోయర్ ప్రసంగించారు. "తప్పుడు సమాచారం ప్రజాస్వామ్యానికి ముప్పును తీసుకుని వస్తుందని.. సమకాలీన ఘటనలపై అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడానికి ప్రజలకు పాత్రికేయులు సహాయం చేస్తారు" అని ఆయన అన్నారు. "దురదృష్టవశాత్తూ, కొన్నిసార్లు తప్పుడు సమాచారం ప్రముఖ మీడియా అవుట్‌లెట్‌ల నుండి వస్తుంది. కొన్నిసార్లు అందులో ఎటువంటి దురుద్దేశం ఉండకపోవచ్చు, కానీ మనం సమాచార సముద్రంలో ఈదుతున్నాము. వాటిలో కొన్ని నిజం.. ఇంకొన్ని అబద్ధాలు ఉంటాయి" అని డేవిడ్ మోయర్ చెప్పుకొచ్చారు.

అబద్ధానికి, వాస్తవానికి మధ్య వ్యత్యాసాన్ని చెప్పడం అంత సులభం కాదని ఆయన అన్నారు. "అయితే ఆ వ్యత్యాసాన్ని చూడడానికి.. దానిని స్పష్టంగా చెప్పడానికి మనమందరం కష్టపడి పనిచేయడం చాలా ముఖ్యం. ఇది జర్నలిస్టులకు ప్రత్యేకంగా వర్తిస్తుంది, ఎందుకంటే ప్రజలు ప్రపంచంలో జరుగుతున్న విషయాలను తెలుసుకోడానికి మీపై ఆధారపడతారు" అని మోయర్ చెప్పుకొచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని జర్నలిస్టులు తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడానికి నైపుణ్యాలను సంపాదించడంలో సహాయపడటానికి OU ముందుకు వచ్చిందని.. అభినందిస్తూ ఉన్నామని అన్నారు.


ఓయూ రిజిస్ట్రార్ ప్రొ.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. సామాన్యుల ప్రయోజనాల కోసం తప్పుడు సమాచారం, తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ప్రతి ఒక్క జర్నలిస్ట్ కు ఉందని చెప్పారు. ప్రముఖ జర్నలిస్టు ఉడుముల సుధాకర్ రెడ్డి, ఫ్యాక్ట్ చెకర్ సత్యప్రియ రచించిన ఫ్యాక్ట్ చెకింగ్ పుస్తకాన్ని అతిథులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సోషల్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ కె. నరేందర్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ హెచ్‌ఓడి ప్రొఫెసర్ కె స్టీవెన్‌సన్ కూడా మాట్లాడారు. డేటాలీడ్స్ వ్యవస్థాపకులు, CEO సయ్యద్ నజాకత్ కూడా మాట్లాడారు. ఫ్యాక్ట్ చెక్ ట్రైనర్లు ఉడుముల సుధాకర్ రెడ్డి, కొరీనా సోరేజ్, ప్రాజెక్ట్ మెంబర్ ఎస్ రాము, యూఎస్ కాన్సులేట్ నుండి అబ్దుల్ బాసిత్ తదితరులు పాల్గొన్నారు.













Next Story