భారీ వర్షాలు.. రేపు పాఠశాలలకు సెలవు

తెలుగు రాష్ట్రాలను వరుణుడు వదలడం లేదు. భారీ వర్ష సూచన కారణంగా మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా యంత్రాంగం ఆగస్టు 14 గురువారం పాఠశాలలకు సెలవు ప్రకటించింది

By Medi Samrat
Published on : 13 Aug 2025 6:14 PM IST

భారీ వర్షాలు.. రేపు పాఠశాలలకు సెలవు

తెలుగు రాష్ట్రాలను వరుణుడు వదలడం లేదు. భారీ వర్ష సూచన కారణంగా మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా యంత్రాంగం ఆగస్టు 14 గురువారం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.

"జిల్లా కలెక్టర్ మేడ్చల్-మల్కాజ్‌గిరి సూచనల మేరకు, భారీ వర్షాల కారణంగా ఆగస్టు 14న పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల అన్ని మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు, అన్ని యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులకు సమాచారం అందింది" అని మేడ్చల్ డీఈఓ మల్కాజ్‌గిరి ఐ విజయ కుమారి తెలిపారు.

Next Story