జైలులో స్కెచ్ వేశారు.. విడుద‌లయ్యాక ప్లాన్ అమ‌లుచేస్తూ ప‌డ్డుబ‌డ్డారు.!

3 కోట్ల రూపాయల విలువైన రెండు ఏనుగు దంతాలను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని స్పెషల్ ఆపరేషన్స్ టీం (SOT), ఎల్.బి.నగర్ జోన్, హయత్ నగర్ అటవీ శ్రేణి అధికారులు అరెస్టు చేశారు.

By Medi Samrat
Published on : 25 Jun 2025 9:18 PM IST

జైలులో స్కెచ్ వేశారు.. విడుద‌లయ్యాక ప్లాన్ అమ‌లుచేస్తూ ప‌డ్డుబ‌డ్డారు.!

3 కోట్ల రూపాయల విలువైన రెండు ఏనుగు దంతాలను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని స్పెషల్ ఆపరేషన్స్ టీం (SOT), ఎల్.బి.నగర్ జోన్, హయత్ నగర్ అటవీ శ్రేణి అధికారులు అరెస్టు చేశారు. నిందితుడు రేకులకుంట ప్రసాద్ (32), ఆంధ్రప్రదేశ్‌లోని రాయచోటికి చెందినవాడు. గతంలో పలు నేరాలు చేశాడు.

ఫిబ్రవరి నెలలో, తిరుపతిలోని రెడ్ సాండర్స్ యాంటీ-స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ (RSASTF) అతన్ని దుంగల స్మగ్లింగ్ కేసులో అరెస్టు చేసి జైలుకు పంపింది. అక్కడ అతను అదే జైలులో ఉన్న లోకేశ్వర్ రెడ్డిని కలిశాడు. నిందితులిద్దరూ పరిచయం ఏర్పరుచుకుని, జైలు నుంచి విడుదలైన తర్వాత, ఏనుగు దంతాలను అక్రమంగా రవాణా చేయడానికి పథకం పన్నారు. లోకేశ్వర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం అడవికి వెళ్లి యానాదుల గిరిజనుల నుండి రెండు ఏనుగు దంతాలను కొనుగోలు చేశాడు. దంతాలను సేకరించిన తర్వాత, నిందితులిద్దరూ ఒక ప్రైవేట్ బస్సు ఎక్కి హైదరాబాద్‌లో విక్రయించాలని ప్లాన్ చేశారు.పక్కా సమాచారం మేరకు, పోలీసులు నిందితుడు ప్రసాద్‌ను పట్టుకుని వారి నుండి దంతాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, లోకేశ్వర్ రెడ్డి పారిపోయాడు. అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Next Story