నేడు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో కాంగ్రెస్ బూత్ స్థాయి సమావేశాలు నిర్వహించనుంది. ఈ సమావేశాలలో ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి, తుమ్మల నాగేశ్వరరావు, ఇతర ముఖ్య నేతలు, కార్పొరేషన్ చైర్మన్ లు పాల్గొంటారు.
షెడ్యూల్..
ఉదయం 10:00 గంటలకు- వెంగల్ రావు నగర్ డివిజన్, మహమూద్ ఫంక్షన్ హాల్ గేట్ 1 వద్ద, మెట్రో పిల్లర్ నెం: 1513. యూసుఫ్గూడ బస్తీ బూత్ స్థాయి సమావేశం
ఉదయం 11.30 గంటలకు యూసుఫ్గూడ డివిజన్, మహమూద్ ఫంక్షన్ హాల్ వద్ద, మెట్రో పిల్లర్ నం: 1513. యూసుఫ్గూడ బస్తీ బూత్ స్థాయి సమావేశం
మధ్యాహ్నం 01:00 గంటలకు ఎర్రగడ్డ డివిజన్ - I.A ప్యాలెస్ ఎర్రగడ్డ ప్రధాన రహదారి బూత్ స్థాయి సమావేశం
సాయంత్రం 04:00 గంటలకు బోరబండ డివిజన్- ప్రొ. జయశంకర్ ఫంక్షన్ హాల్, బోరబండ లో బూత్ స్థాయి సమావేశం జరగనుంది..