ఆ పాపం ఏడు తరాలను వెంటాడుతుంది.. రాజా సింగ్ హెచ్చరికలు

భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే టి.రాజా సింగ్ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి, తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ కమిషనర్ కు కీలక సూచనలు చేశారు.

By Medi Samrat
Published on : 31 May 2025 8:30 AM IST

ఆ పాపం ఏడు తరాలను వెంటాడుతుంది.. రాజా సింగ్ హెచ్చరికలు

భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే టి.రాజా సింగ్ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి, తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ కమిషనర్ కు కీలక సూచనలు చేశారు. ఈద్ అల్ అధా సందర్భంగా గోవులను బలి ఇచ్చే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాబోయే ఈద్ అల్ అధా పండుగను దృష్టిలో ఉంచుకుని ఓ వీడియోను రాజా సింగ్ విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పశువుల అక్రమ రవాణా, గోవధని సమర్ధిస్తున్నట్లు ఆరోపించారు. పశువుల అక్రమ రవాణాను నిరోధించడానికి ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద పశువైద్యుడు నకిలీ సర్టిఫికెట్లు జారీ చేయడానికి ప్రభుత్వం వీలు కల్పిస్తోందని ఆయన ఆరోపించారు. ఆవులను చంపిన పాపం ఏడు తరాలను వెంటాడుతుంది, కాబట్టి ఆ పాపంలో భాగస్వాములు కావద్దని రాజా సింగ్ కోరారు. పశువుల రవాణాలో సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయాలని సూచించారు. పశువుల వాహనాలను పోలీసులు తూ తూ మంత్రంగా చెక్ చేస్తున్నారని ఆరోపించారు.

Next Story