కనిపించకుండా పోయిన బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి.. అధిష్టానానికి కోలుకోలేని షాక్ ఇచ్చాడు..!
2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ ఉపసంహరించుకోవడానికి ఈరోజు చివరి తేదీ.
By Medi Samrat Published on 16 Sept 2024 2:33 PM IST
2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ ఉపసంహరించుకోవడానికి ఈరోజు చివరి తేదీ. ఇప్పటి వరకు పలువురు అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించిన సమాచారం అందింది. సోమవారం బద్లీ నుంచి ఐఎన్ఎల్డీ, బీఎస్పీ కూటమి అభ్యర్థి మహేంద్ర సింగ్ తన నామినేషన్ను ఉపసంహరించుకోవడంతో రాజకీయం మరింత వేడెక్కింది. వాస్తవానికి ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి మహేంద్ర సింగ్ తన ఇంటి నుంచి కనిపించకుండా పోయాడు.
ఐఎన్ఎల్డీ-బీఎస్పీ కూటమిలో బద్లీ సీటు బీఎస్పీకి దక్కింది. బీఎస్పీ ఇక్కడ నుంచి మహేంద్ర సింగ్ను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే అకస్మాత్తుగా ఆయన నామినేషన్ ఉపసంహరించుకోవడం పోటీని మరింత ఆసక్తికరంగా మార్చింది. ఆయన నామినేషన్ ఉపసంహరించుకున్న తర్వాత.. సోమవారం ఉదయం పార్టీ సంస్థాగత స్థాయిలో ఎస్డిఎంకు ఫిర్యాదు అందింది. అందులో ఆయన కనిపించడం లేదని పేర్కొన్నట్లు సమాచారం.
ఈ విషయమై BSP జిల్లా అధ్యక్షుడు సత్ ప్రకాష్ దోచనియా మాట్లాడుతూ.. మహేంద్ర సింగ్తో తాను మాట్లాడలేకపోయానని ధృవీకరించారు. ప్రస్తుతం సంస్థాగత స్థాయిలో సమావేశాలలో తీసుకోయే వ్యూహంపై చర్చ జరుగుతోంది.
మహేంద్ర సింగ్ నిజానికి బద్లీ అసెంబ్లీలోని పెల్పా గ్రామానికి చెందినవారు. ఆయన పెద్దగా చదువుకోలేదు. ఎనిమిదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. బద్లీ నుంచి నామినేషన్ దాఖలు చేయగా.. ఆయన పూరించిన అఫిడవిట్లో తన వద్ద రూ.5,000 నగదు, తన సేవింగ్స్ ఖాతాలో రూ.59 మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నాడు.
మహేంద్ర సింగ్ తన నామినేషన్ ఉపసంహరించుకున్న తర్వాత వార్తల్లో కనిపిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి ఇంటి నుంచి కనిపించకుండా పోయాడు. తనకు పని అవసరమని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన అతడు ఫోన్ను కూడా ఇంట్లోనే ఉంచాడు. బంధువుల ఊరికి వెళ్లాడని భార్య చెప్పింది.