సోనియాగాంధీపై కేసు నమోదు

By సుభాష్  Published on  21 May 2020 9:34 AM GMT
సోనియాగాంధీపై కేసు నమోదు

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీపై కేసు నమోదైంది. పీఎం కేర్స్‌ ఫండ్‌ పై కాంగ్రెస్ పార్టీఅధికారిక ట్విట్టర్‌లో మే 11న చేసిన వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్‌ నమోదైంది. కర్ణాటకలోని శివమొగ్గలో ఓ న్యాయవాది ఫిర్యాదు మేరకు పోలీసులు సోనియాగాంధీ కింద కేసు నమోదు చేశారు. కాగా, కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రిగా ఆ పార్టీకి సంబంధించిన ట్విటర్‌ ఖాతాను సోనియాగాంధీ హ్యాండిల్‌ చేస్తారని ఆరోపణతో ఆమెపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. కేవీ ప్రవీణ్ అనే న్యాయవాది సోనియా గాంధీపై ఈ ఫిర్యాదు చేశారు.

ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోనియాగాంధీ ఉద్దేశ పూర్వకంగానే వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. పీఎం కేర్స్‌ ఫండ్‌మీద సోనియా తప్పుడు ఆరోపణలు చేశారని న్యాయవాది ఫిర్యాదు పేర్కొన్నారు.

Next Story