FactCheck : అమిత్ షా చెప్పడంతో గుంటూరు జిన్నా టవర్ కు రంగులు వేశారా..?

Was Jinnah Tower Painted in Tricolor on the Instructions of Amit Shah. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ఉన్న జిన్నా టవర్‌ దగ్గర జాతీయ జెండాను

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Feb 2022 4:42 PM GMT
FactCheck : అమిత్ షా చెప్పడంతో గుంటూరు జిన్నా టవర్ కు రంగులు వేశారా..?
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ఉన్న జిన్నా టవర్‌ దగ్గర జాతీయ జెండాను ఆవిష్కరించడంపై నిషేధం ఉందని సోషల్ మీడియా వినియోగదారులు పోస్ట్‌లను షేర్ చేస్తున్నారు.


కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు జిన్నా టవర్‌కు త్రివర్ణ రంగులు వేసినట్లు వినియోగదారులు తెలిపారు.

"జిన్నా టవర్, ఆంధ్రప్రదేశ్ గుంటూరు. గత జనవరి 26న భారత జాతీయ జెండాను ఎగురవేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఫలితంగా ఆ టవర్‌కు త్రివర్ణ రంగులు వేశారు." అంటూ వివిధ భాషల్లో పోస్టులు పెట్టారు.

నిజ నిర్ధారణ :

వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

సంబంధిత కీవర్డ్ సెర్చ్ సహాయంతో, జిన్నా టవర్ చుట్టూ ఉన్న మొత్తం రాజకీయం గురించి మేము అనేక మీడియా నివేదికలను కనుగొన్నాము. "జనవరి 26న ఆంధ్రాలోని గుంటూరులోని జిన్నా సెంటర్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు హిందూ వాహిని సభ్యులను అదుపులోకి తీసుకున్న తర్వాత, వైసీపీ ఎమ్మెల్యే టవర్‌కు జాతీయ జెండా రంగులలో పెయింట్ చేసే ప్రయత్నం నిర్వహించారు" అని ఇండియా టుడే నివేదించింది.

జిన్నా టవర్ సెంటర్ గుంటూరులో అత్యంత ముఖ్యమైన ప్రాంతం. మహాత్మా గాంధీ రోడ్ వద్ద ఉన్న ఈ టవర్, దాని పేరు గురించి పెద్ద రాజకీయ వివాదం కొనసాగుతోంది.

https://www-deccanherald-com.translate.goog/national/south/gunturs-jinnah-tower-adorned-with-tricolor-to-keep-communal-flare-up-at-bay-1077486.html?_x_tr_sl=auto&_x_tr_tl=en&_x_tr_hl=en-GB&_x_tr_pto=wapp

గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా షేక్ మాట్లాడుతూ 'అనేక సమూహాల నుండి వచ్చిన అభ్యర్థనల మేరకు టవర్‌కు జాతీయ రంగులు వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు' న్యూస్‌మినిట్ తెలిపింది. వైసీపీ ప్రభుత్వం టవర్‌ పేరును మార్చాలని బీజేపీ పదే పదే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో టవర్‌కు జాతీయ రంగులు వేయాలని నిర్ణయించారు.



OpIndia ప్రకారం, జనవరి 26న దేశం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, ప్రజలు టవర్‌పై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయకుండా గుంటూరు పోలీసులు అడ్డుకున్నారు. వారు కొందరిని అరెస్టు చేసి, జాతీయ జెండాను ఎగురవేసేందుకు ఎవరూ టవర్‌పైకి ఎక్కకుండా భద్రతను పెంచారు. ఆ తర్వాత కొద్దిరోజులకు ప్రభుత్వమే జిన్నా టవర్ వద్ద జాతీయజెండాను ఎగురవేసింది.

కాబట్టి అమిత్ షా ఆదేశాల మేరకు టవర్ కు రంగులు మార్చారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.


Claim Review:అమిత్ షా చెప్పడంతో గుంటూరు జిన్నా టవర్ కు రంగులు వేశారా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story