FactCheck : 2022 జనవరి 14 నుండి 25 వరకు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారా..?

No PM Modi has not Announced a Nationwide Lockdown. 2022 జనవరి 14 నుండి 25 వరకు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Jan 2022 2:48 PM GMT
FactCheck : 2022 జనవరి 14 నుండి 25 వరకు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారా..?

2022 జనవరి 14 నుండి 25 వరకు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక సందేశం వైరల్ అవుతోంది. దేశవ్యాప్తంగా అన్ని దుకాణాలు, మాల్స్, మార్కెట్‌లు మూసివేయబడతాయని ఆ సందేశంలో ఉంది.


నిజ నిర్ధారణ :

వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'

దేశవ్యాప్తంగా దుకాణాలు, మాల్స్, మార్కెట్‌లు కొన్ని ప్రాంతాల్లో మూసివేయబడతాయని చెప్పినప్పటికీ.. అవసరమైన సేవలు అందుబాటులో ఉన్నాయా లేదా అనే దానిపై సరైన సమాచారం లేనందున వైరల్ సందేశం ప్రామాణికమైనదిగా కనిపించడం లేదని NewsMeter తెలిపింది.

కీవర్డ్ సెర్చ్ లో భాగంగా 11 జనవరి 2022న ప్రచురించిన ఇండియా టీవీ నివేదికకు దారితీసింది. లాక్‌డౌన్‌పై చర్చించడానికి మోదీ గురువారం (జనవరి 13) ముఖ్యమంత్రులతో సమావేశం కాబోతున్నారని అందులో పేర్కొంది. "దేశంలో భారీగా పెరుగుతున్న కోవిడ్ కేసులు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ మళ్లీ విధించబడతాయనే భయాలను పెంచాయి. పెరుగుతున్న కోవిడ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగించే విషయం అయితే, లాక్‌డౌన్ విధించడం దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే ఎదుర్కొంటున్న కష్టాలకు మరింత తోడ్పడే అవకాశం ఉంది " అని ఉంది.

గురువారం జరిగిన సమావేశానికి సంబంధించిన నివేదికల కోసం శోధించాము. జనవరి 13 న న్యూస్ 18 ద్వారా నివేదికను కనుగొన్నాము. పౌరులు భయాందోళన చెందవద్దని ప్రధాని కోరారని, కోవిడ్-19కి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో అప్రమత్తమై ఉన్నామని చెప్పారని తెలిపింది. దేశవ్యాప్త లాక్‌డౌన్ గురించి నివేదికలో ఎక్కడా ప్రస్తావించలేదు.

జనవరి 13న ANI, జాగరణ్ మీడియా సంస్థలు కూడా ఇదే విషయాన్ని నివేదించాయి. "ఈ సమావేశంలో, ప్రధాని మోదీ పండుగ సీజన్‌లో ప్రజలు, అధికారులు మరింత అప్రమత్తమై ఉండాలని, భవిష్యత్తులో కోవిడ్ 19 కొత్త వేరియంట్ల విషయమై దేశం సిద్ధంగా ఉండాలని అన్నారు"

జనవరి 25 వరకు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ప్రధాని మోదీ ప్రకటించారనే వాదన అవాస్తవమని జనవరి 13న పిఐబి ఫ్యాక్ట్ చెక్ చేసిన ట్వీట్‌ను కూడా మేము కనుగొన్నాము.

అందువల్ల వైరల్ సందేశం ద్వారా చేసిన వార్త ప్రజలను తప్పు ద్రోవ పట్టించేదని స్పష్టమైంది. ప్రధాని మోదీ 2022లో జనవరి 25 వరకు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ప్రకటించలేదు.


Claim Review:2022 జనవరి 14 నుండి 25 వరకు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story