FactCheck : ప్రధాని మోదీని ఆహ్వానించడానికి పోలీసులకు కాషాయపు గొడుగులను ఇచ్చారా..?

Did TN Government Provide Saffron Umbrellas to Traffic Police to welcome Modi. మోడీకి స్వాగతం పలికేందుకు డీఎంకే ప్రభుత్వం తమిళనాడు ట్రాఫిక్ పోలీసులకు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Jun 2022 2:03 PM GMT
FactCheck : ప్రధాని మోదీని ఆహ్వానించడానికి పోలీసులకు కాషాయపు గొడుగులను ఇచ్చారా..?

మోడీకి స్వాగతం పలికేందుకు డీఎంకే ప్రభుత్వం తమిళనాడు ట్రాఫిక్ పోలీసులకు కాషాయపు రంగు గొడుగులు అందించిందని సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొంటున్నారు.

నిజ నిర్ధారణ :

వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.

NewsMeter ఇంటర్నెట్‌లో ఈ ఘటనకు సంబంధిత కీ వర్డ్స్ తో సెర్చ్ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2022 మే 26న తమిళనాడును సందర్శించినట్లు నివేదించిన కథనాలను కనుగొన్నారు. ఆయన తమిళ భాష శాశ్వతమైనదని, తమిళ సంస్కృతిని మోదీ పొగిడారని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.

https://www.indiatvnews.com/news/india/pm-modi-in-chennai-tn-bjp-chief-hits-out-at-cm-stalin-conduct-presents-facts-2022-05-27-779682

మేము మే 22, 2022 నాటి ట్వీట్‌ని కనుగొన్నాము. ఇది ప్రధాని మోదీ చెన్నైకి వచ్చిన తేదీకి సంబంధించినది కాదు. ఆయన రాకముందే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేయబడింది.

ఇంకా వెతికితే సోషల్ వెల్ఫేర్ యాక్టివిస్ట్ పీయూష్ మనుష్ ఫేస్‌బుక్ పోస్ట్ దొరికింది. పోస్ట్‌లో వైరల్ పోస్ట్‌కు సమానమైన చిత్రం ఉంది.

మేము వైరల్ చిత్రాన్ని జూమ్ చేసాము. రోటరీ క్లబ్, PFI తిరుమల, TMT బార్‌లు వంటి లోగోలు, పేర్లను గొడుగుపై చూడగలిగాము.

దీనిని ఒక క్లూగా తీసుకుంటే, ప్రకాష్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ యొక్క స్ట్రక్చరల్ స్టీల్ విభాగం ప్రకాష్ ఫెర్రస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించినది అని మేము కనుగొన్నాము.

కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టులు మోదీ తమిళనాడు పర్యటనకు సంబంధించినది కాదని తెలుసుకున్నాం.

































Claim Review:ప్రధాని మోదీని ఆహ్వానించడానికి పోలీసులకు కాషాయపు గొడుగులను ఇచ్చారా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:Misleading
Next Story