కృష్ణంరాజు ఫ్యామిలీని పరామర్శించిన రాజ్‌నాథ్‌సింగ్‌

Union Minister Rajnath Singh visited Krishna Raju's family. ప్రముఖ సినీ నటుడు, బీజేపీ నేత కృష్ణంరాజు ఫ్యామిలీని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శుక్రవారం

By అంజి  Published on  16 Sep 2022 10:31 AM GMT
కృష్ణంరాజు ఫ్యామిలీని పరామర్శించిన రాజ్‌నాథ్‌సింగ్‌

ప్రముఖ సినీ నటుడు, బీజేపీ నేత కృష్ణంరాజు ఫ్యామిలీని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శుక్రవారం పరామర్శించారు. శుక్రవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేరుగా కృష్ణంరాజు ఇంటికి వెళ్లారు. అక్కడ కృష్ణంరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి, కూతుళ్లు, హీరో ప్రభాస్‌ను కలిశారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మృతి పట్ల రాజ్‌నాథ్ సింగ్ ప్రగాఢ సంతాపం తెలిపారు. అతని అనారోగ్యానికి కారణం ఏమిటి? ఎలాంటి చికిత్స తీసుకున్నారనే వివరాలను ఎంపీ లక్ష్మణ్ రాజ్ నాథ్‌కు వివరించారు.

కృష్ణంరాజు భార్య, కూతుళ్లకు రాజ్‌నాథ్‌ ధైర్యం చెప్పారు. ప్రభాస్ కూడా కొంతసేపు రాజ్ నాథ్ తో మాట్లాడారు. అనంతరం షేక్‌పేట దర్గా సమీపంలోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృష్ణంరాజు సంతాప సభకు రాజ్‌నాథ్ సింగ్ చేరుకున్నారు. ఆయన వెంట కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డి ఉన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు కృష్ణంరాజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.



Next Story