నాగ చైతన్య తాజా చిత్రం తండేల్ ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలను పెంచే ఆలోచనలో ఉంది టీమ్.
తెలంగాణలో ఎటువంటి పెంపుదల లేకుండా టీమ్ ముందుకు వెళుతున్నట్లు తెలిసింది. ఈ చిత్రం మల్టీప్లెక్స్లలో 295 రూపాయలు, సింగిల్ స్క్రీన్లకు 175 రూపాయల సాధారణ ధరలను కలిగి ఉంటుంది. బుకింగ్లు ఇప్పటికే ఇక్కడ తెరిచారు. ఆంధ్రప్రదేశ్ లో మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్ల కోసం 50 రూపాయల టికెట్ పెంపు కోసం దరఖాస్తు చేసిందని అంటున్నారు. ఏపీలో టికెట్ ధరలకు సంబంధించి ప్రభుత్వం నుంచి జి.ఓ కూడా రావాల్సి ఉంది. త్వరలోనే ఏపీలో బుకింగ్స్ తెరవనున్నారు. మరోవైపు, ఈ చిత్రం U/A సర్టిఫికేట్తో సెన్సార్ సర్టిఫికెట్ ను దక్కించుకుంది. 151.23 నిమిషాల రన్టైమ్ కలిగి ఉంది. బ్రేక్ఈవెన్కి తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 40 కోట్ల షేర్ సాధించాల్సి ఉంది. అభిమానులు, ప్రేక్షకులు ఈ చిత్రంపై భారీ అంచనాలను పెట్టుకున్నారు.