సర్కారు వారి పాట సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. మహేష్ ముందున్న టార్గెట్ ఎంతంటే..!
Sarkari Vari Pata Censor Report. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట
By - Medi Samrat |
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. సర్కారు వారి పాట చిత్రం ఈ నెల 12న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తాజా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ వివరాలను చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ సినిమా నిడివి.. దాదాపు 162 నిమిషాల 25 సెకన్లు ఉంటుంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, మహేష్ సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
All set to embrace your immense love and support from May 12th 💝💫
— Mythri Movie Makers (@MythriOfficial) May 8, 2022
Get ready to witness Super ⭐@urstrulyMahesh's MENTAL MASS SWAG in Theatres Worldwide ❤️🔥
Bookings opening in a phased manner across the board 🤗#SarkaruVaariPaata #SVP #SVPMania pic.twitter.com/0EFKRHlLMQ
సర్కారు వారి పాట చిత్రానికి భారీ స్థాయిలో థియేట్రికల్ బిజినెస్ జరిగింది. సర్కారువారి పాట చిత్రానికి రూ.125కోట్ల థియేట్రికల్ జరిగింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవ్వాలంటే రూ.127కోట్ల వరకు రాబట్టాల్సి ఉంటుంది. మహేష్ బాబు గతం చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' రూ.100.35 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ చిత్రానికి రూ.25కోట్లు పెరిగింది.
ఏరియా వైజ్ బిజినెస్ ఒకసారి గమనిస్తే..
నైజాం : 36 కోట్లు
సీడెడ్ : 13.5 కోట్లు
ఉత్తరాంధ్ర : 13 కోట్లు
ఈస్ట్ : 8.5 కోట్లు
వెస్ట్ : 7.0 కోట్లు
గుంటూరు : 9.0 కోట్లు
కృష్ణ : 7.5 కోట్లు
నెల్లూరు : 4.0 కోట్లు
ఏపి+తెలంగాణ : 98.5 కోట్లు
ఓవర్సీస్ : 11.0 కోట్లు
కర్ణాటక+రెస్ట్ ఆఫ్ ఇండియా : 23.5 కోట్లు
వరల్డ్ వైడ్ థియేట్రికల్ : 125 కోట్లు