శేఖర్ కమ్ముల 'కుబేరా' సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా బుకింగ్స్ తెలంగాణ, తమిళనాడు, ఓవర్సీస్ లలో ప్రారంభమయ్యాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఏపీ టికెట్ల పెంపుపై జీవో విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 రోజులకు (హైయర్ క్లాస్ టిక్కెట్లు మాత్రమే) రూ. 75 పెంపును అనుమతించింది. అయితే ఈ సినిమాకి ధర పెంపు అవసరమా? అనే ప్రశ్నలు ఓ వైపు ఉత్పన్నమవుతూ ఉన్నాయి.
‘కుబేర’ జూన్ 20న తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది. మూవీ మేకర్స్ సెన్సార్ పూర్తైయినట్లు తెలుపుతూ రన్టైమ్ వివరాలను వెల్లడించారు. ఈ సినిమాకు యూఏ సర్టిఫికెట్ రాగా, ఏకంగా మూడు గంటల రన్టైమ్ ఉంది. 181 నిమిషాల నిడివితో ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది. ఈ సినిమా మ్యూజిక్ హక్కులను ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకుంది, థియేట్రికల్ వ్యాపారం దాదాపు 65 కోట్లు సాగింది. థియేట్రికల్ గా, ఈ సినిమా బ్రేక్-ఈవెన్ సాధించాలంటే దాదాపు 120 కోట్లు వసూలు చేయాలి.