డ్యూటీ తరువాతే ఏదయినా.. పెళ్లి వాయిదా వేసుకున్న మహిళా పోలీసు అధికారి
By న్యూస్మీటర్ తెలుగు Published on 19 April 2020 4:55 AM GMTకరోనా వైరస్ ధాటికి ప్రపంచమంతా స్తంభించిన విషయం తెలిసిందే. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఏ పని ముందుకు సాగని పరిస్థితి.. ఈ కార్యం జరుపుకోలేని దుస్థితి. లాక్డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా జనం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ఇంటిపట్టునే ఉంటూ.. వైరస్ నియంత్రణలో బాగస్వామ్యులు అవుతున్నారు. ఇదిలావుంటే.. లాక్డౌన్ కారణంగా ఓ మహిళా పోలీసు అధికారి తన వివాహాన్ని వాయిదా వేసుకున్నారు.
వివరాళ్లోకెళితే.. కర్ణాటక రాష్ట్రం మండ్యా జిల్లాలోని మళవళ్లి డీఎస్పీగా ఎం.జే. పృధ్వీ విధులు నిర్వహిస్తుంది. ఆమె వివాహం ఏప్రిల్ 4న ద్యామప్ప అనే యువకునితో జరుప నిశ్చయమైంది. ఈ మేరకు వివాహానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తిచేశారు. పెళ్లికి ధార్వాడలో, రిసెప్షన్కు మైసూరులో పంక్షన్ హాళ్లు కూడా బుక్ చేశారు. ఓ పక్క పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నా పృధ్వీ మాత్రం లాక్డౌన్ విధుల్లో కొనసాగుతూనే ఉన్నారు.
అయితే.. ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యింది. తాను విధులు నిర్వర్తిస్తున్న మండ్యా, రిసెప్షన్ ఏర్పాట్లు చేసుకన్న మైసూరు జిల్లాల్లో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. ఈ నేఫథ్యంలో పృధ్వీ పెళ్లి వాయిదా వేసుకుని.. డ్యూటీ చేయడానికే మొగ్గుచూపింది. ఏ ఒక్కరితో కడా పెళ్లి వాయిదా విషయాన్ని పంచుకోలేదు. విషయం ఎలా లీకైందో లీకయ్యింది.. పృధ్వీ పెళ్లి వాయిదా వేసుకున్నారని తెలిసిన సహచర అధికారులు ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. విషయం తెలుసుకున్న మాండ్యా ఎంపీ సుమలత అంబరీష్.. డీఎస్పీ పృధ్వీ నిబద్దతను కొనియాడారు.