'నా మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వ‌కండి.. ఆసుపత్రికి ఇవ్వండి'

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం మీరట్ నుంచి ఆగ్రా వచ్చి పంచకుయాన్‌లోని ఓ హోటల్‌లో బస చేసిన యువకుడు గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

By Medi Samrat
Published on : 5 Aug 2025 8:45 AM IST

నా మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వ‌కండి.. ఆసుపత్రికి ఇవ్వండి

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం మీరట్ నుంచి ఆగ్రా వచ్చి పంచకుయాన్‌లోని ఓ హోటల్‌లో బస చేసిన యువకుడు గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం గది నుంచి బయటకు రాకపోవడంతో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చింది. త‌లుపుతట్టినా గది తెరవ‌కపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. లోహమండి పోలీసులు ఫోరెన్సిక్ బృందం సహాయంతో గదిని తెరిచి ఆధారాలు సేకరించారు.

ఘటనపై కుటుంబ‌స‌భ్యుల‌కు సమాచారం అందించారు. మృతుడి మొబైల్‌లో సూసైడ్ నోట్ పీడీఎఫ్ లభ్యమైంది. ఓ మహిళా వైద్యురాలి పేరు రాస్తూనే.. తన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా ఆస్పత్రికి ఇవ్వాలని రాశారు. ప్రాథమిక విచారణలో ప్రేమ వ్యవహారానికి సంబంధించి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.

మీరట్‌లోని గోలాబాద్‌లోని శివరాంపురం నివాసి సుఖ్‌దేవ్ చంద్ర కుమారుడు రోహిత్ కుమార్ ఆదివారం సాయంత్రం లోహమండి ప్రాంతంలోని పంచకుయాన్‌లో ఉన్న హోటల్ ఖుబ్సరస్‌లో ఒక గదిని అద్దెకు తీసుకున్నాడు. హోటల్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. రోహిత్‌ రాత్రి భోజనం చేసేందుకు బయటకు వెళ్లి వ‌చ్చాడు. ఆ తర్వాత గది నుంచి బయటకు రాలేదు. ఉదయం బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చింది.

గది బయటి నుంచి సిబ్బంది త‌లుపు తట్టినా స్పందన లేదు. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసు బృందం త‌లుపు తెరిచినట్లు ఏసీపీ లోహమండి మయాంక్ తివారీ తెలిపారు. లోపల ఫ్యాన్‌కు ఉరి వేసుకుని రోహిత్ మృతదేహం కనిపించింది. ఆధారాలు సేకరించిన అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించి, అతని మొబైల్‌లో ఉన్న నంబర్ల ఆధారంగా బంధువులకు సమాచారం అందించారు.

మృతుడు రోహిత్ మొబైల్ ఫోన్‌లో సూసైడ్ నోట్ పీడీఎఫ్ కాపీని పోలీసులు గుర్తించారు. అందులో ఒక మహిళా డాక్టర్ పేరు ఉంది. మరణానంతరం మృతదేహాన్ని త‌న త‌ల్లిదండ్రుల‌కు ఇవ్వవ‌ద్ద‌ని సూసైడ్ నోట్‌లో రాశాడు. అతడి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి వైద్యుల అధ్యయనానికి వినియోగించాలని కోరాడు. మహిళా వైద్యురాలు గతంలో ఆగ్రాలో ఉండేదని, ఇప్పుడు మరో జిల్లాలో ఉన్నారని చెబుతున్నారు. ఆ యువకుడు ముంబై ఐఐటీలో చదువుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Next Story