ప్రియుడి ప్రైవేట్ పార్ట్‌ కోసేసిన యువతి.. ఆ తర్వాత ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.!

Yoga instructor chops off private parts of male friend. రాజస్థాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. యోగా టీచర్‌గా పనిచేస్తున్న 35 ఏళ్ల మహిళ యోగా టీచర్ అదే ప్రొఫెషన్‌లో ఉన్న తన 28 ఏళ్ల ప్రియుడి పురుషాంగాన్ని కోసింది.

By అంజి  Published on  21 Nov 2021 9:50 AM GMT
ప్రియుడి ప్రైవేట్ పార్ట్‌ కోసేసిన యువతి.. ఆ తర్వాత ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.!

రాజస్థాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. యోగా టీచర్‌గా పనిచేస్తున్న 35 ఏళ్ల మహిళ యోగా టీచర్ అదే ప్రొఫెషన్‌లో ఉన్న తన 28 ఏళ్ల ప్రియుడి ప్రైవేట్ పార్ట్‌ కోసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జైపూర్‌ పట్టణ శివారులోని భంక్రోటాలో ఓ మహిళ యోగా టీచర్‌గా పని చేస్తోంది. ఈ క్రమంలోనే అదే ప్రొఫెషన్‌లో ఉన్న యువకుడితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు వీలైనప్పుడల్లా కలుస్తూ ఒకే గదిలో భోజనం చేస్తూ ఒకే గదిలో నిద్రించేవారు. రెండు రోజుల కిందట యోగా క్లాస్‌ అయిపోయాక ఇంటికి వెళ్తున్న మహిళ.. ఆ యువకుడికి ఫోన్‌ చేసి కూరగాయాలు తీసుకురావాలని చెప్పింది.దీంతో అతడు కూరగాయాలు తీసుకుని ఆమె ఫ్లాట్‌కు వెళ్లాడు. వంట చేసుకుని ఇద్దరూ అక్కడే భోజనం చేశాడు.

ఆ తర్వాత యువకుడు తన ఇంటికి వెళ్లేందుకు బయల్దేరాడు. తాను వస్తానని మహిళ చెప్పడంతో ఆమెను కారులో ఎక్కించుకుని యువకుడు తన ఇంటికి వెళ్లాడు. ఇంటికి చేరుకున్న వెంటనే కాస్తా మత్తుగా అనిపించడంతో నిద్రపోయాడు. ఆ రోజు రాత్రి 2 గంటలకు యువకుడికి మెలుకువ వచ్చింది. నడుము కింద విపరీతమైన నొప్పి, లేవలేని స్థితిలో ఉన్న ఆ యువకుడు బెడ్‌ లైట్‌ వేసుకుని కళ్లు తెరిచి చూడగా బెడ్‌పై రక్తపు మరకలు కనిపించాయి. వెంటనే కిందకి చూసుకోగా ప్రైవేట్ పార్ట్‌ సగం తెగిపోయి కనబడింది. దీంతో ఆ యువకుడు ఒక్కసారిగా బెంబేలెత్తిపోయాడు. వెంటనే అతడు తన ప్రియురాలి కోసం చూశాడు. అయితే ఆమె అప్పటికే అక్కడి నుండి జారుకుంది. సాయం కోసం గట్టిగా అరిచినా పొరుగింటి వాళ్లు ఎవరూ స్పందించకపోవడంతో ఆ యువకుడు తన ప్రియురాలి ఫోన్‌ చేశాడు.

అయితే ఫోన్‌లో ఆ యువతి ఐయామ్‌ సారీ, నన్ను క్షమించు అంటూ యువకుడితో మాట్లాడింది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్న యువకుడు.. తనను ఎలాగైన ఆస్పత్రిలో చేర్చించాలని ప్రియురాలిని కోరాడు. దీంతో వెంటనే అతడి ఇంటికి వచ్చిన మహిళ.. అతడిని ఆస్పత్రిలో చేర్పించింది. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. యువకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని భంక్రోటా పోలీస్ స్టేషన్‌లోని ఒక అధికారి తెలిపారు. భోజనం సమయంలో బాధితుడికి మత్తుమందు ఇచ్చినట్లు తెలుస్తోందని అధికారి తెలిపారు.

Next Story