Hyderabad : విద్యుత్‌ వైర్లు తెగి ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఇద్దరు సజీవదహనం

ఆదివారం హైదరాబాద్ లో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులపై హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగి వారిపై పడటంతో విద్యుదాఘాతంతో మరణించారని పోలీసులు తెలిపారు

By Medi Samrat
Published on : 15 Jun 2025 7:18 PM IST

Hyderabad : విద్యుత్‌ వైర్లు తెగి ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఇద్దరు సజీవదహనం

ఆదివారం హైదరాబాద్ లో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులపై హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగి వారిపై పడటంతో విద్యుదాఘాతంతో మరణించారని పోలీసులు తెలిపారు. బాధితులు యాచకులుగా అనుమానిస్తున్నట్లు ఎల్‌బి నగర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ కె వినోద్ కుమార్ తెలిపారు.

ఈ సంఘటన తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరిగింది. వారు అక్కడికక్కడే మరణించారు. మృతదేహాలను శవపరీక్ష కోసం పంపినట్లు పోలీసు అధికారి తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. చనిపోయిన వ్యక్తుల సమాచారం కోసం అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు.

Next Story