ఓకే కుటుంబానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నెల్లరు జిల్లా ఉదయగిరికి చెందిన కుటుంబం గత ఏడాది క్రితం బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ నగరానికి వచ్చారు. దంపతులకు వినీల(17), అఖిల(16) ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. పెద్ద అమ్మాయి గత మూడు నెలల క్రితం ఓ యువకుడిని ప్రేమించి ఇంట్లో నుండి వెళ్లిపోవడం జరిగింది. దీంతో తల్లిదండ్రులు పెద్దల సమక్షంలో మాట్లాడి నచ్చజెప్పి అమ్మాయిని ఇంటికి తీసుకురావడం జరిగింది
అనంతరం.. ఇరువురు కూతుళ్లను చదువుకోండి ఈ విధంగా చేయడం మంచిది కాదని తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఈరోజు మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అక్కాచెల్లెలిద్దరు కిటికీ రెయిలింగ్ కి చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే బాలాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.