ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది.

By Medi Samrat  Published on  11 Aug 2023 11:02 AM GMT
ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బవ్లా-బగోద్రా హైవేపై మినీ ట్రక్కు.. ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతులను అహ్మదాబాద్ రూరల్ ఎస్పీ ధృవీకరించారు. పొరుగున ఉన్న సురేంద్రనగర్ జిల్లాలోని చోటిలా నుండి కొంతమంది వ్యక్తులు అహ్మదాబాద్‌కు తిరిగి వస్తుండగా రాజ్‌కోట్-అహ్మదాబాద్ హైవేపై బగోద్రా గ్రామ సమీపంలో ఈ ప్ర‌మాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు, ఇద్దరు పురుషులు మృతి చెందారు.

Next Story