వివాహితపై 79 రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డ తాంత్రికుడు

Tantrik rapes married woman for 79 days in Odisha. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాకు చెందిన ఓ వివాహిత తాంత్రికుడి చేతిలో అత్యాచారానికి గురైంది.

By Medi Samrat  Published on  8 May 2022 1:01 PM GMT
వివాహితపై 79 రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డ తాంత్రికుడు

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాకు చెందిన ఓ వివాహిత తాంత్రికుడి చేతిలో అత్యాచారానికి గురైంది. తన వైవాహిక విభేదాలను పరిష్కరించే నెపంతో ఆమె భర్త, అత్తమామలు ఆమెను ఒక తాంత్రికుడుతో లైంగిక సంబంధాలు కొనసాగించమని బలవంతం చేశారని ఆరోపించింది. తాంత్రికుడు, ఆమె భర్త, అతని తల్లిదండ్రులు, తమ్ముడిపై బాధితురాలు జలేశ్వర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దంపతులకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు.

మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాంత్రికుడు తనపై 79 రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. తాంత్రికుడిని ఎస్.కె.తరఫ్ గా గుర్తించారు. బాలాసోర్‌లోని భోగ్రాయ్ బ్లాక్‌లోని కఖారా గ్రామానికి చెందిన వ్యక్తి అని తెలిసింది. అతను మయూర్‌భంజ్ జిల్లాలోని బైంచ్‌డిహా గ్రామంలో చేతబడి చేస్తున్నాడని ఆరోపించారు. 2017లో పెళ్లయినప్పటి నుంచి అత్తమామలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఎఫ్‌ఐఆర్‌లో మహిళ తెలిపింది. తనతో అసభ్యంగా ప్రవర్తించారని, ఈ విషయాన్ని తన భర్తకు తెలియజేసినా అతడు పట్టించుకోలేదని తెలిపింది.

ఆమె భర్త కొత్త దుకాణం ప్రారంభించేందుకు వేరే ఊరికి వెళ్లాడు. ఆమె అత్తగారి కుటుంబం ఓ మాంత్రికుడి వద్దకు తీసుకువెళ్ళింది. అతను వారి వివాహ వివాదాన్ని పరిష్కరిస్తానని హామీ ఇచ్చింది. అయితే ఆ మహిళ అతని వద్ద కొన్ని రోజులు ఉండవలసి వచ్చింది. అక్కడే ఉండడానికి ఆమె ఒప్పుకోకున్నా.. అక్కడే వదిలేశారని ఆ మహిళ పేర్కొంది. తనను గదిలో బంధించారని, కుటుంబ సభ్యులను సంప్రదించే అవకాశం లేకుండా చేశారని బాధితురాలు తెలిపింది. ఏప్రిల్ 28న బాధితురాలు తాంత్రికుడి సెల్‌ఫోన్‌ను ఎలాగోలా సంపాదించింది. బాధితురాలు తన తల్లిదండ్రులకు తను పడుతున్న కష్టాలను మెసేజ్ చేసింది. తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫోన్ చేయడంతో పోలీసులు ఆమెను రక్షించారు.











Next Story