నోయిడాలో 55 ఏళ్ల వ్యక్తి తన భార్యకు వివాహేతర సంబంధాలున్నాయనే అనుమానంతో ఆమెను కొట్టి చంపాడని అధికారులు శనివారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు నూరుల్లా హైదర్ తన భార్య అస్మా ఖాన్ తలపై సుత్తితో కొట్టడంతో ఆమె మృతి చెందింది. శుక్రవారం నాడు నోయిడాలోని సెక్టార్ 15 ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. 42 ఏళ్ల బాధితురాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్, నోయిడాలోని సెక్టార్ 62లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. ఆమె గతంలో ఢిల్లీలో నివసించింది. జామియా మిలియా ఇస్లామియా నుండి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. నిందితుడు బీహార్కు చెందినవాడు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కూడా. అయితే, అతను ప్రస్తుతం ఎలాంటి ఉద్యోగం చేయలేదని అధికారులు తెలిపారు.
ఈ జంట 2005లో వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు. ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. వారి కుమారుడు ఇంజనీరింగ్ విద్యార్థి కాగా, వారి కుమార్తె 8వ తరగతి చదువుతోంది. ప్రాథమిక దర్యాప్తులో హైదర్ తన భార్యకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నాడని తేలింది.