విద్యార్థినిని బలిగొన్న ఆన్‌లైన్ గేమ్స్‌

Student commits suicide as parents reprimand him for playing online games in Anantapur. అనంతపురంలో ఓ విద్యార్థినిని ఆన్‌లైన్ గేమ్‌లు బలిగొన్న విషాద ఘటన జ‌రిగింది.

By Medi Samrat
Published on : 29 April 2022 3:18 PM IST

విద్యార్థినిని బలిగొన్న ఆన్‌లైన్ గేమ్స్‌

అనంతపురంలో ఓ విద్యార్థినిని ఆన్‌లైన్ గేమ్‌లు బలిగొన్న విషాద ఘటన జ‌రిగింది. వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం గుట్టకిందపల్లికి చెందిన సంతోష్ కుమార్ (20) డిగ్రీ చదువుతున్నాడు. మొబైల్‌లో ఆన్‌లైన్ గేమ్‌లు ఆడేందుకు అలవాటు పడి డిగ్రీ రెండో సంవత్సరం చదువు మానేశాడు. ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్ వీడియో గేమ్‌లు ఆడుతున్నాడు. కాగా, ఈ విషయమై తల్లిదండ్రులు సంతోష్‌ను నిలదీశారు.

చదువు మానేసి ఆన్‌లైన్ గేమ్‌లు ఆడుతూ జీవితం గడుపుతున్నాడని మందలించారు. దీంతో మనస్తాపం చెందిన సంతోష్ పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో సంతోష్ చనిపోయాడు. పట్నం ఎస్‌ఐ సాగర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story